పాన్ ఇండియా హీరోల్లో ఒకరైన ప్రభాస్ ఏ హీరో చేయని విధంగా పలు ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఆయన చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ లలో ఆది పురుష్ ఒకటని చెప్పాలి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా రామాయణం ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నారు. కృతిసనన్ సీతగా మెప్పించనుంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా అలరించబోతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన హక్కులను ప్రభాస్ కి దగ్గరైన యూవీ క్రియేషన్స్ సంస్థ వంద కోట్ల రూపాయలకు దక్కించుకుందని సమాచారం. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే కలెక్షన్లు ఎలా ఉంటాయో చెప్పాల్సిన అవసరమే లేదు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఆదిపురుష్ లాస్ ఏంజిల్స్ లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. త్రీడీ వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. ఆది పురుష్ సినిమాని విడుదల చేసేందుకు నిర్మాతలు భారీ ఎత్తున సన్నాహాలు చేసుకుంటున్నారు.
ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఆది పురుష్ సినిమా థియేట్రికల్ హక్కులకు భారీ క్రేజ్ ఏర్పడింది. ప్రభాస్ సినిమాలు సాహో, రాధేశ్యామ్ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో పాటు ఇప్పటివరకు ఆదిపురుష్ సినిమాకి సంబంధించిన చిన్న ఫస్ట్ లుక్ ప్రోమో కూడా బయటికి రాలేదు. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భగా ఫస్ట్ లుక్ వస్తుందేమోనని ఆశతో అభిమానులున్నారు. ముంబయి మీడియా దర్శకుడు ఓంరౌత్ ని ప్రశ్నించగా అతను తీపి కబురు చెప్పాడు. ప్రభాస్ పుట్టిన రోజుకి కచ్చితంగా పెద్ద ట్రీట్ ఉంటుందని.. అది జస్ట్ ఫస్ట్ లుక్ కాదని సంకేతాలు ఇచ్చాడు. ఇది విన్న అభిమానులు తెగ సంతోషపడుతున్నారు.