Prabhas: ఆ క్రేజీ కాంబినేషన్లో మరో సినిమా రానుందా..?

కేజీఎఫ్ సిరీస్ తో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ రెబల్ స్టార్ ప్రభాస్ ల కాంబినేషన్లో సలార్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలో ఉండగానే ప్రశాంత్ నీల్, ప్రభాస్ ల కాంబినేషన్లో మరో మూవీ రానుంది అంటూ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ కాంబినేషన్లో రానున్న రెండో సినిమాపై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇవ్వటం విశేషం. ప్రస్తుతం శాకుంతలం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో ఈ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం కథా చర్చల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ సలార్ సినిమా రిలీజ్ తర్వాత ఫైనలైజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ప్రభాస్, ప్రశాంత్ నీల్ కమిట్ అయిన ప్రాజెక్ట్స్ పూర్తయ్యాక ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని వెల్లడించిన దిల్ రాజు పౌరాణిక నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందని క్లారిటీ ఇచ్చారు. దిల్ రాజు నుండి ఈ క్రేజీ అప్డేట్ రాగానే ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చటానికి చాలా సమయం పట్టేలా ఉంది. ఒక్క ప్రభాస్ సాలార్ సినిమాతో పాటు ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే సినిమాలు వరుసలో ఉండటం. ఇప్పటికే ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా రావాల్సి ఉండటమే ఇందుకు కారణం.
ఇప్పటికే సలార్ సినిమాకు గాను సుమారు 600కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరగటంతో ఇది 1000కోట్లు కలెక్ట్ చేసే సినిమా అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దిల్ రాజు అనౌన్స్ చేసిన సినిమా పౌరాణిక నేపథ్యంలో సాగే సినిమాకు అంతకంటే ఎక్కువ బడ్జెట్ పెట్టాల్సి వస్తుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఒక్క అనౌన్స్మెంట్ తోనే సోషల్ మీడియాలో హీట్ పెంచేసిన ఈ కాంబినేషన్ ఎప్పటికి కార్యరూపం దాల్చుతుందో వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు