People Media Factory: బ్రో రిలీజ్ వాయిదా పడనుందా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన “బ్రో” సినిమా రోజురోజుకి అంచనాలను పెంచేస్తుంది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాసాడు. ఇక ఈ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ తో, పాటు లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ సినిమాపై ఉన్న అంచనాలని తారాస్థాయికి తీసుకెళ్లాయి. అయితే ఎన్ని అప్డేట్లు వచ్చినా ఈ సినిమాకి ఉండే ఒకే ఒక్క బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ పవన్ కళ్యాణ్ మాత్రమే.

అందుకే చిత్ర యూనిట్ పవన్ కళ్యాణ్ జనసేన ప్రచారంలో బిజీగా ఉంటాడని గ్రహించి ఆయనకీ సంబంధించిన అన్ని పనులను పూర్తిచేయించారు. ఇక ఈ సినిమా రిలీజ్ కి ఏ అడ్డు లేదనుకున్న తరుణం లో తాజాగా జరిగిన ఒక విషాదం అభిమానులను కలవరపెడుతుంది. అదేంటంటే, “బ్రో” చిత్ర నిర్మాతల్లో ఒకరైన టీజీ విశ్వా ప్రసాద్ మాతృమూర్తి అయిన గీతాంజలి జూన్30న కన్నుమూశారు. ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేసారు.

ఇదిలా ఉండగా టీజీ విశ్వప్రసాద్ తల్లి మరణం వల్ల “బ్రో” సినిమా రిలీజ్ వాయిదా వేయవచ్చు, అని చిత్ర వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఎవరైనా వ్యక్తి మరణిస్తే ఆ ఇంట్లో ఏ శుభకార్యమైనా, లేదా పెద్ద పనులను కనీసం నెలరోజుల వరకు మొదలుపెట్టరు. మరి బ్రో లాంటి ప్రతిష్టాత్మక సినిమాను రిలీజ్ చేస్తారా అంటే బహుశా డౌటే అని చెప్పాలి. అయితే ఈ ఇన్సిడెంట్ వల్ల బ్రో కి జరిగే నష్టమేమి లేదని, మహా అయితే మూవీ మరో వారం రోజులు ముందుకు వెళ్లొచ్చు. అంతే కానీ మరీ నెలరోజులు వాయిదా పడే ఛాన్స్ అయితే లేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు