బాలీవుడ్ బాద్షా కింగ్ షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జవాన్. ఈ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ భారీ రెస్పాన్స్ ని దక్కించుకుంది. షారుఖ్ ఖాన్ చాలా రోజులకు మళ్ళీ తన పాత పంథా లో ఒక ఎనర్జిటిక్ రోల్ ని పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా లేడీ సూపర్ స్టార్ నయనాతార నటించగా, విజయ్ సేతుపతి, దీపికా పదుకొనె, ప్రియమణి కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
ఇక జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ ఒక మాజీ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా టీజర్ లో ఒక షాట్ నెట్టింట తెగ వైరల్ అయిపోతుంది. అదేంటంటే షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో ఒక మెట్రో స్టేషన్ లో కూర్చుని అక్కడి జనాలని అందర్నీ తాను వేసుకున్న మాస్క్ లాంటిదే వాళ్లకు కూడా వేసి ఒక సందర్భంలో మొత్తం జనాల్ని బయటికి పంపించడం జరుగుతుంది.
ఇలాంటి సీన్ తెలుగులో అల్లరి నరేష్ హీరోగా నటించిన బ్లేడ్ బాబ్జి చిత్రంలో చూడడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ దాదాపు అదే సీన్ రిపీట్ కావడంతో అట్లీ మన బ్లేడ్ బాబ్జి సినిమాను చూసే కాపీ కొట్టాడని తెలుగు ఆడియన్స్ అంటున్నారు. ఇకపోతే ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ ఆర్మీ నుండి బయటికి వచ్చాక ఒక దొంగ గా మారతాడని నెటిజన్లు అంటున్నారు. టీజర్ లో ఈ షాట్స్ ని గమనిస్తే అది నిజమే అనిపిస్తుంది. అయితే బ్లేడ్ బాబ్జి సినిమాలో పెట్టిన కాన్సెప్ట్ నే ఈ సినిమాలో కూడా వాడారా అనేది మాత్రం తెలియదు. ఇప్పుడు సోషల్ మీడియా లో మాత్రం ఈ టాపిక్ ట్రెండింగ్ లో ఉంది.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News