Srinu Vaitla next movie update
కమర్షియల్ సినిమాలలో కామెడీ, ఎమోషన్స్ ప్రధానంగా ఉండేలా చూసుకుంటూ సినిమాలు తీసి సూపర్ హిట్స్ అందుకున్న డైరెక్టర్ శ్రీను వైట్ల, గతకొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. దీనికి కారణం ఆయన ఇటీవల కాలంలో చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడమే
2013 లో శ్రీను వైట్ల- ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన బాద్షా సినిమా తరువాత ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలేవి సరిగా ఆడలేదు. బాద్షా సినిమా తరువాత ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు ఒకటి తరువాత ఒకటి రిలీజై, బాక్స్ ఆఫీస్ వద్ద అతి పెద్ద డిజాస్టర్ లుగా నిలిచాయి. దాంతో శ్రీను వైట్ల తో సినిమా చేయడానికి యంగ్ హీరోలెవరు ఆసక్తి చూపించకపోయేసరికి శ్రీను వైట్ల కెరీర్ కు గ్యాప్ వచ్చింది.
ఇక లేటెస్ట్ గా ఆయన మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయినట్టు సమాచారం అందుతోంది. ఇటీవలనే శ్రీను వైట్ల హీరో గోపిచంద్ ను కలిసి కథ వినిపించారట, గోపిచంద్ కూడా శ్రీను వైట్ల చెప్పిన కథ బాగా నచ్చడంతో ఈ సినిమాని పట్టాలెక్కించె పనిలో పడ్డాడట శ్రీను వైట్ల. ప్రస్తుతం గోపిచంద్ ఒక కన్నడ దర్శకుడి డైరెక్షన్ లో భీమా అనే యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ అయిపోగానే గోపిచంద్, శ్రీను వైట్లల సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు సమాచారం. సెప్టెంబర్ లో శ్రీను వైట్ల పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది.
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify