Mamitha Baiju : రెమ్యూనరేషన్ పెంచేసిన “ప్రేమలు” హీరోయిన్

సెన్సేషనల్ హీరోయిన్ మమిత బైజు తాజాగా తన రెమ్యూనరేషన్ ను పెంచేసినట్టు సమాచారం. ప్రేమలు మూవీతో ఈ బ్యూటీ క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మమిత బైజు ఇప్పుడు యూత్ కొత్త క్రష్. ఇప్పుడు అదే క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనుకుంటుంది మమత. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని సామెతను ఫాలో అవుతోంది. ఇంతకీ ఈ అమ్మడు ఇప్పటిదాకా ఎంత పారితోషికం అందుకుంది? ఇప్పుడు ఎంత రెమ్యూనరేషన్ పెంచేసింది? అనే వివరాల్లోకి వెళ్తే…

రెమ్యూనరేషన్ డబుల్…
నిన్న మొన్నటిదాకా టాలీవుడ్ కు అసలు మమిత బైజు అంటే ఎవరో కనీసం పరిచయం కూడా లేదు. కేవలం మలయాళ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అయిపోయిన ఈ బ్యూటీ ప్రేమలు మూవీతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీలో సెన్సేషన్ గా మారింది. ఒక్క సినిమాతోనే అన్ని వుడ్స్ సినీ ప్రియులను తన వైపుకు తిప్పేసుకుంది. మొన్నా మధ్య ప్రేమలు మూవీ తెలుగు ఈవెంట్ టైంలో ఏకంగా ఒక అభిమాని స్టేజ్ పైనే హారతి ఇచ్చి ఆమెతో పాటు అందరికీ షాక్ ఇచ్చాడు. ఆ రేంజ్ లో ఆమెను ఆరాధిస్తున్నారు యూత్ అంతా. ఆ క్రేజ్ ను, తనకు పెరిగిన డిమాండ్ ను క్యాష్ చేసుకోవాలనుకుంటుంది మమత. ఒకవైపు ఆఫర్లు వెల్లువెత్తుతుంటే తొందరపడి చేతికి వచ్చిన సినిమాలకు సైన్ చేయకుండా ఆచితూచి అడుగులు వేస్తోంది. మరోవైపు పారితోషకం విషయంలో కూడా అంతే జాగ్రత్తగా నడుచుకుంటుంది. నిన్న మొన్నటిదాకా 30 లక్షలు దాకా పారితోషకం అందుకున్న మమిత ఇప్పుడు దాన్ని డబుల్ చేసేసింది. కొత్త సినిమాల కోసం ఏకంగా 50 లక్షలు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. అయితే ఆమెకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ప్రొడ్యూసర్లు మమిత అడిగినంత ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఈ బ్యూటీ నెక్స్ట్ మూవీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కానీ ఆమె తర్వాత మూవీ గురించి అభిమానుల ఎక్స్పెక్టేషన్స్ మాత్రం వేరే లెవెల్ అన్నట్టుగా ఉన్నాయి.

“ప్రేమలు” కంటే ముందే ఫేమస్…

- Advertisement -

నిజానికి మమిత బైజు టాలెంట్ ప్రేమలు మూవీతో బయటపడలేదు. అంతకంటే ముందే మాలీవుడ్ లో పలు సినిమాలతో తన టాలెంట్ ను నిరూపించుకుని అవకాశాలను అట్రాక్ట్ చేసింది. సూపర్ శరణ్య అనే మూవీలో నటించి పర్ఫామెన్స్ ఇరగదీసింది. దీంతో ఏకంగా కోలీవుడ్ స్టార్ సూర్య సరసన నటించే అవకాశం దక్కింది. కొన్నాళ్ల క్రితం బాలా దర్శకత్వంలో సూర్య హీరోగా, కృతి శెట్టి, మమిత బైజు హీరోయిన్లుగా ఓ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ముందుగా మమిత ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత హీరో, దర్శకుడు మధ్య విభేదాల కారణంగా ఈ ప్రాజెక్టు అటకెక్కింది. రీసెంట్ గా ఆ మూవీ షూటింగ్ టైంలో డైరెక్టర్ బాలా తనను కొట్టాడంటూ మమిత స్టేట్మెంట్ ఇచ్చినట్టు వచ్చిన వార్తలు దుమారం రేపాయి. ఇక ప్రస్తుతం మమిత “రెబెల్” అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. జీవి ప్రకాష్ హీరోగా నటించిన ఈ మూవీ ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. ఈ మూవీ తర్వాత తనకు మరిన్ని మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది ఈ బ్యూటీ. మరి టాలీవుడ్ నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందో చూడాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు