Prabhas : జక్కన్న బాటలో..

రెబ‌ల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో సలార్ ఒకటి. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ. 270 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. సలార్ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న విడుదల చేయనున్నారు. ముందుగా ఈ ఏడాది ఏప్రిల్ 14నే విడుదల చేస్తామని చిత్ర‌ యూనిట్ ప్రకటించింది. కానీ కరోనా మహమ్మారి కారణంగా ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. దీని ఫలితంగా విడుదల తేదీ కూడా వాయిదా పడింది.

ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకుంది. షూటింగ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యేక్షమయ్యాయి. తాజాగా మరి కొన్ని ఫోటోలు కూడా నెట్టింట్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా షూటింగ్ స్పాట్ లో ప్రభాస్ ఉన్న ఫోటోలు లీక్ కావ‌డంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా సీరియస్ అయినట్టు తెలుస్తోంది.

షూటింగ్ స్పాట్ లో ఫోటోలు లీక్ అవుతున్న నేపథ్యంలో ప్రశాంత్ నీల్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతుంది. ఇక నుంచి నటీ, నటులు గానీ, టెక్నికల్ టీమ్ సభ్యులు గానీ షూటింగ్ సెట్ లోకి మొబైల్ ఫోన్స్ తీసుకురావద్దని ఆర్డర్ వేశాడట. కార్ వ్యాన్ లో కానీ, లాకర్స్ లో కానీ మొబైల్స్ ఉంచాలని సూచించిన‌ట్టు సమాచారం. షూటింగ్ సెట్ లో మొబైల్ ను పూర్తిగా నిషేధించారని తెలుస్తోంది. కాగా గతంలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ సమయంలో కూడా ఫోటోలు లీక్ అవుతున్నాయని, రాజమౌళి కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకోవ‌డం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు