Pan India Star : కెరీర్ లో మూడోసారి..

పాన్ ఇండియా హీరో ప్రభాస్ వరుసగా భారీ సినిమాలు చేస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసే ప్రతి చిత్రం భారీ బడ్జెట్ తోనే వస్తుంది. అలాగే పాన్ ఇండియా స్తాయిలోనే ఉంటుంది. ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ వంటి భారీ చిత్రాలు చేస్తున్నారు. వీటి మధ్యలో ఒక చిన్న సినిమా చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడు. అందులో భాగంగా కామెడీ సినిమాల దర్శకుడు మారుతీతో సైన్ చేశారు. ప్రభాస్, మారుతీ కాంబినేషన్ లో సినిమా వస్తుందని చాలా రోజుల నుండి ప్రచారం జరిగింది. ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా ఉంటారని కూడా టాక్ వచ్చింది.

ఇటీవల అధికారికంగా అతి తక్కువ మంది అతిథుల మధ్య సీక్రెట్ గా ప్రభాస్, మారుతీ చిత్రం పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అయితే డీవీవీ దానయ్య కాకుండా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. పూజా కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆఫీస్ లోనే జరిగినట్లు సమాచారం అందుతుంది. ఇది ఇలా ఉండగా, ఈ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ చిత్రం కామెడీ హర్రర్ నేపథ్యం లో సాగుతుందట. ప్రభాస్ కు జోడీ గా ముగ్గురు హీరోయిన్లు నటిస్తారని తెలుస్తుంది. దీంతో పాటు ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తారని టాక్ వినిపిస్తుంది. తాత, మనవళ్లు నేపథ్యంలో వచ్చే ఈ చిత్రంలో తాత, మనవడు రెండు పాత్రల్లో ప్రభాస్ నటిస్తున్నట్లు సమాచారం అందుతుంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా ప్రభాస్ ఇప్పటికే సలార్ అనే చిత్రంలో రెండు పాత్రలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి ముందు బాహుబలి సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేసిన విషయం తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు