Richest South Heroine: సౌత్ లో అత్యంత ధనిక హీరోయిన్ ఎవరో తెలుసా..?

ఒకప్పుడు హీరోయిన్లకి పారితోషికం కేవలం లక్షల్లో మాత్రమే ఇచ్చేవాళ్ళు.. కానీ ఇప్పుడు హీరోయిన్లు కూడా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకోవడంతో వారు కూడా కోట్లల్లో డిమాండ్ చేస్తున్నారని చెప్పవచ్చు.. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్లకి పోటీ ఇస్తూ.. మన సౌత్ హీరోయిన్లు కూడా కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకుంటూ కోటీశ్వరులు అవుతున్నారు ఇకపోతే 2024 వరకు కోట్లు కూడబెట్టి వ్యాపారాలు చేస్తూ.. సెట్ అయిన మన సౌత్ హీరోయిన్లలో అత్యంత ధనిక హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

నయనతార..
సౌత్ సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార సుమారుగా రూ.300 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం.. చెన్నైతో పాటు కేరళ , హైదరాబాద్, ముంబై వంటి ప్రధాన నగరాలలో రూ .100 కోట్ల విలువైన 4 లగ్జరీ ఇళ్లతో పాటు 4 బీ హెచ్ కే ఇల్లు కూడా కలిగి ఉంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకి బాలీవుడ్ హీరోయిన్స్ తో పోటీ పడుతూ రూ.10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.

అనుష్క:
సౌత్ ఇండియన్ రిచెస్ట్ హీరోయిన్స్ జాబితాలో అనుష్క రెండవ స్థానంలో నిలిచింది.. తెలుగు, తమిళ భాషల్లో భారీ క్రేజ్ దక్కించుకున్న ఈమె రూ.133 కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది. బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాలు చేసిన ఈమె చాలాకాలం గ్యాప్ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో రీయంట్రీ ఇచ్చింది.. ప్రస్తుతం మలయాళం చిత్రం అయినా కత్నార్ – ది వైల్డ్ సోర్సెరర్ లో నటిస్తోంది.. ఈ సినిమాకి గానూ రూ.6కోట్ల వరకూ పారితోషకం తీసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

తమన్నా:
తమన్నా ఒక్కో సినిమాకి రూ .5కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుంది.. తెలుగు , తమిళ్ సినిమాలలో అడపాదడపా నటిస్తూ ఎక్కువగా వెబ్ సిరీస్ ల పైన ఆసక్తి చూపిస్తున్న ఈమె హిందీ , మలయాళం చిత్రాలలో కూడా నటిస్తోంది. ఇక ఈమె నికర ఆస్తుల విలువ దాదాపు రూ.130 కోట్లు ఉంటుందని సమాచారం..

సమంత:
ప్రస్తుతం ఒక్కో సినిమాకి రూ.7కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటున్న సమంత పలు యాడ్ లు, వ్యాపారాలు కూడా చేస్తోంది. ఇటీవలే వెబ్ సిరీస్లలో కూడా సందడి చేస్తోంది. ప్రస్తుతం ఈమె ఆస్తుల విలువ రూ .100 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం.

త్రిష:
గత 20 ఏళ్లకు పైగా హీరోయిన్ గా నటిస్తున్న ఈమె కాస్త గ్యాప్ తీసుకొని పొన్నియన్ సెల్వన్ సినిమాతో రీయంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత విజయ్ సరసన లియో సినిమాలో నటించిన ఈమె.. ప్రస్తుతం చిరంజీవితో విశ్వంభర సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకి రూ.6 నుంచి రూ.8 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్న త్రిష రూ.90 కోట్ల వరకు కూడబెట్టినట్లు సమాచారం.

ఇక నేషనల్ క్రష్ రష్మిక మందన్న రూ.70 కోట్లు, కాజల్ అగర్వాల్ రూ. 58 కోట్లు, పూజా హెగ్డే రూ.55 కోట్లు కూడబెట్టినట్లు సమాచారం.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు