Naresh – Pavithra: ఘట్టమనేని ఇంటికి కొత్త వారసుడు ?

ఇటీవల టాలీవుడ్ ఎక్కువగా మాట్లాడుకున్న అంశాలలో నరేష్, పవిత్ర లోకేష్ ల పెళ్లి విషయం ఒకటి. ఈ ఏడాది ప్రారంభంలో నరేష్ ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. పవిత్ర లోకేష్ తాను.. కొత్త సంవత్సరం నుంచి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తున్నట్టు అప్పుడు అనౌన్స్ చేశాడు. ఈ ప్రకటనను ఇద్దరు ఘాటు లిప్ లాక్ చేస్తూ ప్రకటించారు. ఇటీవల తాము పెళ్లి చేసుకున్నామని ఓ పెళ్లి వీడియోను కూడా నరేష్ షేర్ చేశాడు.

అనంతరం హనీమూన్ కి దుబాయి వెళ్లారు. అక్కడ ఈ ఓల్డ్ జంట ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం ఈ జంట సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. తమ ప్రేమకు గుర్తుగా ఏదో ఒకటి చేయాలని నరేష్, పవిత్ర అనుకున్నారట. ఈ క్రమంలో ఒక బిడ్డకు జన్మనివ్వాలనే ఆలోచన వచ్చిందని టాక్.

తమ ప్రేమకు గుర్తుగా, అలాగే తమపై వస్తున్న ట్రోల్స్ కు చెక్ పెట్టేలా బిడ్డకు జన్మనివ్వాలని నిర్ణయం తీసుకున్నారట. దీనికి పవిత్ర కూడా ఒప్పుకోవడంతో ప్రస్తుతం ఆ ప్రయత్నంలో ఉన్నారని గుస గుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, ఒక వేళ నరేష్, పవిత్ర నిజంగానే ఓ బిడ్డకు జన్మనిస్తే.. ఘట్టమనేని వారి ఇంటికి మరో వారసుడు వస్తాడనే చెప్పొచ్చు. కాగా నరేష్ తమ్ముడు… సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇప్పటికే గౌతమ్ అనే కుమారుడు, సితార అనే కుమార్తే ఉన్న సంగతి విధితమే.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు