Naa saami Ranga: మెగా బ్రదర్స్ చేస్తే తప్పు – నాగార్జున చేస్తే రైటా…?

Naa saami Ranga

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల బ్రో, భోళాశంకర్ లాంటి రీమేక్ సినిమాలతో వచ్చి తీవ్ర నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ రీఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150, గాడ్ ఫాదర్ సినిమాలు రీమేక్ కాగా, ఖైదీ నంబర్ 150 హిట్ అవ్వగా, గాడ్ ఫాదర్ సినిమా నిరాశ పరిచింది. ఇక పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ నుండి వరుసగా రీమేక్ సినిమాలు చేస్తున్నడు.

వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు అలరించినా పవర్ స్టార్ రేంజ్ హిట్స్ అయితే, కాలేకపోయాయి. ఇక ఇటీవల వచ్చిన బ్రో సినిమా అభిమానులను సైతం మెప్పించలేకపోయింది. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్స్ ఇద్దరు ఇక రీమేక్ సినిమాలు చేయటం పట్ల సోషల్ మీడియాలో ట్రోల్స్ పెరిగిపోగా, రీమేక్ సినిమాలు ఇక ఆపాలంటూ అభిమానులు సైతం విజ్ఞప్తి చేసే పరిస్థితి తలెత్తింది.

ఇదిలా ఉండగా మరో సీనియర్ హీరో నాగార్జున కూడా ‘నా సామిరంగ’ అనే రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా గ్లిమ్ప్స్ రిలీజయ్యి ఆకట్టుకుంది. పోరింజు మరియం జోస్ అనే మలయాళ సినిమాకు ఇది రీమేక్. అయితే, నాగార్జున రీమేక్ సినిమా చేయటంపై సోషల్ మీడియాలో ఏ మాత్రం హడావిడి కనిపించటం లేదు.అదే మెగా బ్రదర్స్ గనక ఈ రీమేక్ సినిమా చేసుంటే, ఇంకా ఎన్ని రీమేక్ సినిమాలు చేస్తారంటూ ట్రోల్స్ తో సోషల్ మీడియాలో పరిస్థితి ఇంకోలా ఉండేదని మెగా అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -

నాగార్జున రీమేక్ సినిమా చేయటం పట్ల మెగా ఫ్యాన్స్ లో ఎలాంటి నెగిటివ్ ఒపీనియన్ లేనప్పటికీ భోళాశంకర్, బ్రో సినిమాల సమయంలో పని కట్టుకు మరీ రీమేక్ అన్న పాయింట్ మీద ట్రోల్ చేసిన బ్యాచ్ ఇప్పుడు సైలెంట్ గా ఎందుకున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.

మెగా బ్రదర్స్ రీమేక్ సినిమాలతో అభిమానులను సైతం నిరాశ పరిచిన మాట వాస్తవమే కానీ, ఒక సెక్షన్ ఆఫ్ ఫ్యాన్స్ పని కట్టుకు నెగిటివిటి స్ప్రెడ్ చేయటం వల్లనే బ్రో, భోళాశంకర్ సినిమాలకు ఎక్కువ డ్యామేజ్ జరిగిందన్నది వాస్తవం.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు