Mahesh Babu : కేజీఎఫ్ నిర్మాతలతో

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి విధితమే. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకున్నా, కలెక్షన్లు మాత్రం బాగా చేసింది. సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు సినిమా త్రివిక్రమ్ తో ఉంటుంది. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. త్రివిక్రమ్ స్క్రిప్ట్ పనులను పూర్తి చేసుకున్నాడని, ఆగస్టు 15 తర్వాత షూటింగ్ కూడా ప్రారంభం అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.

దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు సినిమా చేయనున్నాడు. దీనిపై మహేష్, రాజమౌళి పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చారు. ఈ రెండు సినిమాలపై రేపు మహేష్ పుట్టిన రోజు సందర్భంగా అప్డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే రాజమౌళి తో సినిమా తర్వాత మహేష్ ఎలాంటి సినిమా చేస్తాడు. ఎవరితో చేస్తాడు అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నారు. దీనిపై ఇప్పటి వరకు చాలా వార్తలు వచ్చాయి.

తాజాగా మరో వార్త వినిపిస్తుంది. రాజమౌళితో సినిమా పూర్తి అయిన తర్వాత మహేష్ బాబు తన తర్వాత చిత్రం కేజీఎఫ్ నిర్మాతలు హోంబలే ఫిల్మ్స్ తో ఉంటుందని టాక్ వినిపిస్తుంది. దీనికి సంబంధించన ఒప్పందం హోంబలే ఫిల్మ్స్ కి, సూపర్ స్టార్ మహేష్ బాబు కి మధ్య జరిగిందని సమాచారం అందుతుంది. ఈ విషయంపై రేపు మహేష్ పుట్టిన రోజు సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు