Adipurush పై మాధవి లత వివాదాస్పద వ్యాఖ్యలు…ఇది రామాయణమే నా ?

తెలుగులో హీరోయిన్ మాధవి లత గురించి తెలియని వారు ఉండరు. నచ్చావులే సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైన మాధవి లత ఫస్ట్ సినిమాతోనే చాలా పెద్ద సక్సెస్ సాధించారు. ఈ సినిమాకి ముందు ఆమె కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు. అలాగే మహేష్ బాబు హీరోగా వచ్చిన అతిధి సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా కూడా నటించారు.

ఈ విధంగా మాధవి లతా కెరియర్ స్టార్ట్ అయింది. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ మాధవి లతా తన ఇన్ స్టాగ్రామ్ లో ప్రభాస్ పై ఓ సంచలన పోస్ట్ షేర్ చేసింది. ఆమె మాట్లాడుతూ… రాముడి పాత్ర చేసిన ప్రభాస్ ను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు. సినిమా విషయంలో ప్రభాస్ ది కూడా తప్పు ఉందని అన్నారు. ఆది పురుష్ మ్యాటర్ లో అందరూ డైరెక్టర్ ని దొబ్బుతున్నారని, హీరో మ్యాటర్ లో సైలెంట్ అయ్యారని అన్నారు. హీరోకి బాధ్యత లేదా అని ప్రశ్నించారు.

స్టోరీ వినేటప్పుడు, తీసేటప్పుడు, డైలాగ్ చెప్పేటప్పుడు తెలియలేదా అని అన్నారు. ప్రభాస్ ఏమైనా కొత్తగా సినిమాలు చేస్తున్నారా… డైరెక్టర్ ఏది చెబితే అది చేయడానికి, కథ విన్నాడుగా అప్పుడే తెలియాలి కదా అంటూ తీవ్ర విమర్శలు చేసింది మాధవి లత. కాగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ జంటగా నటించిన చిత్రం ఆదిపురుష్. దీని డైరెక్టర్ ఓంరౌత్. మహాకావ్యం రామాయణం ఆధారంగా రూ. 500 కోట్ల బడ్జెట్ తో తిరకెక్కించారు అయితే జూన్ 16వ విడుదలై మిక్స్డ్ స్పందనను దక్కించుకుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు