పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా సలార్. కేజీఎఫ్ తో ప్రశాంత్ నీల్ కు క్రేజ్ రావడంతో ప్రభాస్ సలార్ సినిమా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరోవైపు ప్రభాస్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో హిట్లు కొట్టడంతో వీరిద్దరి కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సలార్ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. దాంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.
ఇక భారీ అంచనాల నడుమ విడుదలవుతున్న ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్ ఆసక్తకర విషయాలను పంచుకున్నాడు. ఈ సినిమా భారీ యాక్షన్ సినిమాగా రాబోతోందని ప్రేక్షకులు అనుకుంటున్న సంగతి తెలిసిందే. కానీ ప్రశాంత్ నీల్ మాత్ర ఇది యాక్షన్ సినిమానే అని కానీ అంతకు మించి ఎమోషనల్ సినిమా అని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కన్సార్ లో ఇద్దరు స్నేహితుల మధ్య ఉండే ఎమోషనల్ జర్నీ ఈ సిినిమా అని అసలు నిజం బయటపెట్టారు. ఇద్దరు స్నేహితుల మధ్య ఉండే ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ ప్యాక్డ్ డ్రామా అని చెప్పాడు.
సినిమాలో ప్రతి యాక్షన్ సన్నివేశం కూడా ఒక ఎమోషన్ నుండి పుట్టుకువస్తుందని తెలిపాడు. ఇక ప్రశాంత్ నీల్ కామెంట్స్ తో ఈ సినిమా పై అంచనాలు మరిన్ని పెరిగాయి. నిజానికి ప్రభాస్ యాక్షన్ ఏ రేంజ్ లో చూపించగలడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రభాస్ ఎమోషనల్ సీన్లు చేయలేడని ఓ మచ్చ ఉండేది. కానీ బాహుబలి సినిమాతో ఆ కామెంట్లకు ప్రభాస్ చెక్ పెట్టేశాడు. ఇక ఇప్పుడు సలార్ లో యాక్షన్ మరియు ఎమోషన్స్ కలిసి ఉండటంతో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.
For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News