Yatra 2: జగన్ బయోపిక్ కోసం జీవా, మమ్ముట్టి భారీ పారితోషికం

Yatra 2

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్ రాజకీయ జీవిత ప్రయాణం నేపథ్యంలో రూపొందిన మూవీ “యాత్ర 2”. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన “యాత్ర” సినిమాకు సీక్వెల్ గా “యాత్ర 2” రాబోతోంది. ఫిబ్రవరి 8న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో నటించిన నటీనటులకు భారీ పారితోషకం అందినట్టు టాక్ నడుస్తోంది. ముఖ్యంగా సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన మమ్ముట్టి, జీవా రెమ్యూనరేషన్ విషయం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ ఇద్దరు స్టార్స్ “యాత్ర 2″లో నటించినందుకు గాను ఎంత పారితోషకం అందుకున్నారు ? అంటే…

2004 ఎన్నికలకు ముందు రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా “యాత్ర” రూపొందగా, 2019 ఏపీ ఎలక్షన్స్ ముందు ఫిబ్రవరిలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. “యాత్ర”కు మహి వి రాఘవ్ దర్శకత్వం వహించగా, ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి పాత్రను పోషించారు. తాజాగా డైరెక్టర్ మహి వి రాఘవ్ “యాత్ర 2” పేరుతో సీక్వెల్ ను తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ మూవీనీ 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రాజకీయాలు, వైయస్ జగన్ పాదయాత్ర నేపథ్యంలో రూపొందిస్తున్నట్టు డైరెక్టర్ మొదటి నుంచే చెప్పుకుంటూ వస్తున్నారు.

2019 ఎన్నికలకు ముందు రాజశేఖర రెడ్డి తనయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర, రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు జరిగిన పరిణామాలు, ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ ను తొక్కేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు? జగన్మోహన్ రెడ్డి ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు అనే అంశాల నేపథ్యంలో “యాత్ర 2″ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచేశాయి. మరి కొన్ని గంటల్లో “యాత్ర 2” థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో సినిమా బడ్జెట్ గురించి జోరుగా చర్చ నడుస్తోంది.

- Advertisement -

“యాత్ర 2″లో రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి, జగన్మోహన్ రెడ్డి పాత్రలో తమిళ హీరో జీవా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను రూపొందించడానికి ఏకంగా 50 కోట్లు ఖర్చు చేశారట నిర్మాతలు. అందులో ప్రొడక్షన్ బడ్జెట్ కంటే రెమ్యూనరేషన్ కే ఎక్కువ ఖర్చయినట్టు తెలుస్తోంది. జీవాకు 8 కోట్లు రెమ్యూనరేషన్ గా ఇచ్చినట్టు సమాచారం. అలాగే మమ్ముట్టికి 3 కోట్లు పారితోషికంగా చెల్లించారట నిర్మాతలు. సాధారణంగా హీరోలు మామూలు సినిమాలకు మామూలుగానే పారితోషకం తీసుకుంటారు.

కానీ వివాదాస్పద చిత్రాలకు లేదా రాజకీయ ఎజెండాతో నేపథ్యంలో తెరకెక్కే సినిమాలకు సైన్ చేసేటప్పుడు సాధారణంగా కంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ఈ ఇద్దరు హీరోలు కూడా “యాత్ర 2” విషయంలో అదే చేశారు. ఇక హీరోలు మాత్రమే కాదు సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్, డైరెక్టర్ మహి వి రాఘవ్, సినిమాటోగ్రాఫర్ మధి ముగ్గురికీ కలిపి మొత్తం 10 కోట్లు పారితోషకంగా అందుకున్నారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. మరి ఫిబ్రవరి 8న రిలీజ్ కాబోతున్న “యాత్ర 2″కు ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ దక్కుతుందో చూడాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు