Hbd Namratha: లవ్ లో ఉన్నప్పుడు మహేష్, నమ్రతను నాలుగేళ్లు విడదీసింది ఎవరో తెలుసా?

Hbd Namratha : టాలీవుడ్ లోని మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ అనగానే గుర్తొచ్చే జంటలలో మహేష్ బాబు – నమ్రత శిరోద్కర్ ఒకరు. ఈ ఎవర్ గ్రీన్ జంట ఎంతోమందికి ఆదర్శం. అయితే మహేష్, నమ్రత పెళ్లి గురించి పలు రూమర్లు ఇప్పటికీ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇక వీళ్ల గురించి ఏ వార్త బయటకు వచ్చినా సినీ ప్రియులు కూడా అంతే ఎగ్జైటింగ్ గా చదివేస్తూ ఉంటారు. వాళ్లకు మరింత ఇంట్రెస్ట్ కలిగించే విషయం మహేష్, నమ్రత లవ్ స్టోరీ. ఈరోజు నమ్రత పుట్టినరోజు సందర్భంగా వీళ్ళ లవ్ స్టోరీ లో విలన్ ఎవరు? మహేష్ నమ్రతలు లవ్ లో ఉన్నప్పుడు నాలుగేళ్లు విడదీసింది ఎవరు? అనే ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం.

2000లో వచ్చిన వంశీ సినిమా షూటింగ్ సమయంలో మహేష్, నమ్రత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ సినిమా షూటింగ్ న్యూజిలాండ్ లో జరగగా, అక్కడే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. షూటింగ్ అయిపోయి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత ముందుగా నమ్రత ప్రేమ విషయాన్ని బయట పెట్టిందట. ఆమె స్వయంగా మహేష్ బాబుకు ఐ లవ్ యు చెప్పేసి, తనతో కలిసి జీవించాలని కోరుకుంటున్నానని చెప్తూ ప్రపోజ్ చేసిందట. అప్పటికే మహేష్ కూడా నమ్రత ప్రేమలో నిండా మునగడంతో వెంటనే ఓకే చెప్పేసాడట.

అయితే అప్పట్లో మీడియా పరిధి ఇప్పుడున్న లెవెల్లో లేకపోవడంతో ఈ విషయం బయటకు రాలేదు. కానీ ఏడాది పాటు సీక్రెట్ గా ప్రేమించుకున్న ఈ జంట ఆ తర్వాత ఇంట్లో వాళ్లకు చెప్పాలని డిసైడ్ అయ్యారట. అయితే సెలబ్రిటీ కపుల్ అయినప్పటికీ వీళ్ళ ప్రేమకు పెద్దల నుంచి అంగీకారం అంత త్వరగా లభించలేదు. ఇంతకీ వీళ్ళ ప్రేమకు మెయిన్ విలన్ ఎవరు? అంటే మహేష్ బాబు ఫ్యామిలీ. మరోవైపు నమ్రత కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రేమ పెళ్లికి ముందుగా ఒప్పుకోలేదట. దీంతో వీళ్ళ మధ్య ఎడబాటు మొదలైందట.

- Advertisement -

ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో నాలుగేళ్ల పాటు మహేష్, నమ్రత దూరంగా ఉండిపోయారట. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళట. అంతేకానీ డైరెక్ట్ గా కలిసే సాహసం చేయలేదట అప్పట్లో ఈ జంట. ఇక ఈ నాలుగేళ్లపాటు ఇరువురు తమ ఇంట్లో వాళ్ళను కన్విన్స్ చేయడానికి గట్టిగా ప్రయత్నించారట. ఆ తర్వాత పెద్దలు దిగివచ్చి మహేష్, నమ్రత పెళ్లికి ఒప్పుకున్నారట. ఇక వీళ్ళ పెళ్లిలో కీలక పాత్రను పోషించింది మహేష్ సోదరి మంజుల. మహేష్ కుటుంబ సభ్యులను ఈ పెళ్లికి ఒప్పించే బాధ్యతను మంజుల తన భుజానికి ఎత్తుకున్నారట.

తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ వీళ్ళ పెళ్లికి మొత్తానికి ఇరు కుటుంబ సభ్యుల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అలా 2005లో వీళ్ళిద్దరికీ ఇద్దరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి జరిగింది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా నమ్రత వెల్లడించింది. 1994లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న నమ్రత అప్పట్లో తెలుగులో అంజి, వంశీ వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. హిందీలో చాలా సినిమాలే చేసిన ఈ బ్యూటీ పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుతం ఆమె తన ఇద్దరు పిల్లల బాధ్యతను, మహేష్ సినిమాలకు సంబంధించిన వ్యవహారాలను, బిజినెస్ వంటి మిగతా విషయాలను చూసుకుంటుంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు