Guntur Kaaram: పూజా హెగ్డేను తీసేయలేదంటున్న ప్రొడ్యూసర్ – ” దొంగతనం” కాదు, “తస్కరించుట” అన్నట్లుంది..!

సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న గుంటూరు కారం సినిమా అడ్డంకులన్నీ దాటుకొని ఈ మధ్యనే సెట్స్ మీదకి వెళ్ళింది. ఈ సినిమాలో పూజా హెగ్డే స్థానంలో మీనాక్షి చౌదరిని రీప్లేస్ చేశారు. అసలు కారణమేంటో తెలీదు కానీ, సినిమా యూనిట్ మాత్రం డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవటమే రీజన్ అని చెప్తోంది.
ఆ మధ్య సోషల్ మీడియాలో చాలా కాలం పాటు మీమ్స్ స్టఫ్ గా మారిన ఈ ఇష్యూ ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది. మ్యాడ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రొడ్యూసర్ నాగవంశీ ఈ టాపిక్ గురించి మాట్లాడటమే ఇందుకు కారణం.
పూజ హెగ్డేను గుంటూరు కారం నుండి తప్పించటానికి గల కారణం గురించి యాంకర్ ఆగడగా రెస్పాండ్ అయిన నాగవంశీ, పూజా తమ ఫ్యామిలీలోని అమ్మాయని, తమతో ఎంతో క్లోజ్ గా ఉంటుందని, అలంటి అమ్మాయిని ఎందుకు తీసేస్తామని అన్నాడు. కేవలం డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవటం కారణంగానే పూజాని రీప్లేస్ చేయాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చాడు. తీసేసాం అనటం కంటే రీప్లేస్ చేశాం అనటం కరెక్ట్ అని అన్నాడు.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా కానీ, తన లైనప్ లో ఉన్న నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్నిటిలో శ్రీలీలని హీరోయిన్ గా తీసుకున్నామని చెప్తూ తాను మోస్ట్ ట్యాలెంటెడ్ అని, మంచి అమ్మాయని కితాబివ్వటం పలు అనుమానాలకు దారి తీస్తోంది.
తమ ఇంట్లో మనిషి లాంటిదని చెప్పిన పూజ హెగ్డేను తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లో ఒక్క దానిలో కూడా  ఎందుకు తీసుకోలేదని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. దొంగతనం కాదు, తస్కరించుట అని ఓ సినిమాలో డైలాగ్ లాగా పూజాని తీసేయలేదు, రీప్లేస్ చేశామని ప్రొడ్యూసర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఉన్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు