యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ “డీజే టిల్లు” అనే మూవీతో తెలుగు ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చాడు. చిన్న సినిమానే అయినప్పటికీ అందులో సిద్ధూ నటన, కామెడీ సెన్స్ టాలీవుడ్ ఆడియన్స్ ను కట్టిపడేశాయి. అయితే కాకుండా ఈ మూవీతోనే సిద్దు ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ యంగ్ స్టార్ నెక్స్ట్ మూవీ గురించి అంతా ఎదురు చూస్తున్నారు. సిద్ధూ చేతిలో ఇప్పుడు “టిల్లు స్క్వేర్” మూవీ ఉంది. ఈ మూవీ 2024 ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. 2022లో విడుదలైన “డీజే టిల్లు” సినిమాకి సీక్వెల్ గా రూపొందుతోంది “డీజే టిల్లు స్క్వేర్”. ఇక మన టిల్లు గత మూవీ కమర్షియల్ గా సూపర్ సక్సెస్ సాధించడంతో తన రెమ్యునరేషన్ కూడా పెంచేశారట.
తెలుగు సినీ పరిశ్రమలో ఇంతకుముందు రిలీజ్ పోస్ట్ పోన్ అయిన సినిమాల్లో “టిల్లు స్క్వేర్” ఒకటి. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సీక్వెల్ ప్రకటించినప్పటి నుంచి అనేక వివాదాలకు కేంద్ర బిందువైంది. ముందుగా ఈ సినిమాకు డైరెక్టర్ విమల్ కృష్ణ కాగా, క్రియేటివ్ డిఫరెన్స్ ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మల్లిక్ రామ్ దర్శకుడిగా ఎంపికయ్యారు. అంతేకాదు ఈ చిత్రంలో మొదట కథానాయికగా ఎంపికైన శ్రీలీల కూడా ఆ తరువాత సినిమా నుండి డ్రాప్ అయ్యింది. దీంతో నిర్మాతలు అనుపమ పరమేశ్వరన్ను కథానాయికగా తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాగా ఇప్పటికే మూవీ నుంచి రిలీజైన సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు మంచి బజ్, సిద్ధూ ఫ్యాన్స్ సపోర్ట్ ఉన్నప్పటికీ ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ కు మాత్రం అడ్డంకులు తప్పలేదు.
ఇక ప్రస్తుతం సిద్ధూ చేతిలో “టిల్లు స్క్వేర్”తో పాటు మరో మూవీ కూడా ఉందట. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఒక్కో సినిమాకు గానూ సిద్ధూ 10 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నాడట. “టిల్లు స్క్వేర్” హిట్ అయితే ఈ యంగ్ హీరో తన రెమ్యూనరేషన్ ను మరింత పెంచే అవకాశం ఉంది. మరి టాలీవుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న “టిల్లు స్క్వేర్” సిద్ధూ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తుందా అనేది చూడాలి.
For More Updates : Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.