NTR: ఎన్టీఆర్ లైనప్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్..!

RRR సినిమాకు ఆస్కార్ వచ్చిన ఎంజాయ్ మెంట్ లో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తర్వాతి ప్రాజెక్ట్స్ ను కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. ఎన్టీఆర్, కొరటాల శివ సినిమా ఇప్పటికే ప్రారంభం కాగా, ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా మొదలవనుంది. ఇదిలా ఉండగా, ఇటీవల  వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ నటించబోతున్నారన్న వార్త ఫ్యాన్స్ లో ఆనందాన్ని నింపింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ లైనప్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. విడుదల పార్ట్ 1 సినిమా స్పెషల్ షో కోసం వచ్చిన దర్శకుడు వెట్రిమారన్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. సినిమా స్పెషల్ షో తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆడుకాలం సినిమా తర్వాత వడ చెన్నై స్క్రిప్ట్ తో అల్లు అర్జున్ ని కలిశానని కానీ వర్కౌట్ కాలేదని అన్నారు. లక్డౌన్ తర్వాత ఎన్టీఆర్, మహేష్ బాబుని కలిశానని, కథా చర్చలు జరుగుతున్నాయని అన్నారు. కొంచెం టైం పట్టాచ్చేమో గానీ, తన నుండి తెలుగులో సినిమా తప్పకుండ ఉండబోతుందని చెప్పుకొచ్చారు వెట్రిమారన్.

అయితే ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళితో సినిమా కమిట్ అయియున్నాడు కాబట్టి ఆ షూటింగ్ స్టార్ట్ అయితే, ఇంకో సినిమా షూట్ చేసే ఛాన్స్ లేదు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల సినిమాతో వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలో నటించనున్నారు. దీన్ని బట్టి చుస్తే వచ్చే ఏడాదిలో ఎన్టీఆర్ వెట్రిమారన్ ల కాంబోలో సినిమా వచ్చే ఛాన్స్ ఉండనుంది అన్నమాట. రూరల్ బ్యాక్డ్రాప్ లో రా సినిమాలకు ప్రసిద్ధి అయిన వెట్రిమారన్ ఎన్టీఆర్ కోసం ఎలాంటి కథను తయారు చేస్తారో, వీరి కాంబినేషన్లో సినిమా ఎలా ఉండనుందో అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు