Anasuya Bharadwaj Latest News :
అనసూయ భరద్వాజ్ గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. బుల్లితెరపై స్టార్ యాంకర్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె.. తెలుగు రాష్ట్రాలలో తనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది. ప్రస్తుతం అనసూయ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఓ పక్క సినిమాలు చేస్తూనే, మరోపక్క యాంకర్ గా కూడా కొనసాగుతోంది. ఇక సోషల్ మీడియాలో కూడా ఫుల్ ఆక్టివ్ గా ఉంటున్న ఆమె.. తన సినిమాలు, ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
అయితే అప్పుడప్పుడు కొన్ని విషయాలలో కాంట్రవర్సీలకు కూడా ఛాన్స్ ఇస్తూ ఉంటుంది. తనపై వచ్చే ట్రోలింగ్స్ కి కూడా సాలిడ్ కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. అదే సమయంలో విపరీతంగా ట్రోల్లింగ్ కి గురవుతూ ఉంటుంది. అనసూయ ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న పుష్ప సీక్వెల్ వచ్చే ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రంగమ్మత్త తాజాగా చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహర్షి వాల్మీకి రచించిన రామాయణంలోని ఓ కొటేషన్ ని షేర్ చేసింది అనసూయ. రామాయణంలోని యుద్ధకాండలో మహిళ గురించి శ్రీరాముడు చెప్పిన వ్యాఖ్యాన్ని ఈ ట్వీట్ లో ప్రస్తావించింది. “ఇల్లు, దుస్తులు, ఇంటి గోడలు, తలుపులతో పాటు ఇంకా విలువైనవి కేవలం స్త్రీని కనిపించకుండా మాత్రమే కాపాడగలవు. కానీ ఆమె క్యారెక్టర్ మాత్రమే కవచంలా పనిచేసి ఆమెను రక్షిస్తుంది” అంటూ రామాయణంలోని ఓ కొటేషన్ ని షేర్ చేసింది. అయితే ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసిందనే ఆలోచనలో పడ్డారు నెటిజెన్లు.
Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.