Ajay Devgan : 8 సీక్వెల్స్ చేయబోతున్న ఒకే ఒక్క ఇండియన్ హీరో!

Ajay Devgan : టాలీవుడ్ లో సీక్వెల్ సినిమాలకి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అవి ఒరిజినల్ ని చెడగొట్టే విధంగా మారొచ్చని ఆడియన్స్ అభిప్రాయం. అయితే అదే విధంగా కొన్ని సినిమాలు హిట్ కూడా అవుతుంటాయి. కానీ ఆ సినిమాలు ఒరిజినల్ ని మించి ఆకట్టుకున్నాయా లేదా అనేదే పాయింట్. లేటెస్ట్ గా రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ సినిమా ఏ రేంజ్ హిట్ తో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డీజే టిల్లు కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా ఒరిజినల్ కి ఏమాత్రం తగ్గని విధంగా ఉంటుంది. అయితే అదే విధంగా కొన్నేళ్ల కింద తెలుగులో వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్, కిక్ 2 వంటి సినిమాలు కూడా ఏ రేంజ్ లో బోల్తా కొట్టాయో కూడా తెలిసిందే. మాములుగా ఒక హిట్ సినిమాకు సీక్వెల్ అంటేనే పెద్ద రిస్క్. అంచనాలు మోయలేక ఫెయిలయ్యేవి, అధికంగా ఉంటే మొదటి భాగాలను మించి బ్లాక్ బస్టర్స్ అయ్యేవి లేకపోలేదు. టిల్లు స్క్వేర్, బాహుబలి 2, కెజిఎఫ్ 2 లాంటివి రెండో క్యాటగిరీలోకి వస్తాయి. అందుకే కొనసాగింపు అంటే తెలుగు హీరోలు దర్శకులు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. పుష్ప, కార్తీకేయ అంత పెద్ద సక్సెస్ అందుకున్నాయి కాబట్టే కంటిన్యుయేషన్ సులభమయ్యింది.

ఏకంగా 8 సీక్వెల్స్ చేయనున్న హీరో!

కానీ ఇతర సినిమా ఇండస్ట్రీలలో మాత్రం ఒక సినిమా హిట్ అయిందంటే చాలు వాటికి సీక్వెల్ కథలు అప్పుడే అల్లుకుపోతాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో ఎలాంటి జోనర్ సినిమాలైనా సీక్వెల్స్ తెరకెక్కడం ఖాయం. ఇదిలా ఉండగా ఒక హీరో ఒక సీక్వెల్ చేయడం ఇప్పటిదాకా చూస్తున్నాం. అలాంటిది ఒకేసారి 8 సీక్వెల్స్ కి రంగం సిద్ధం చేసుకుంటున్న స్టార్ ఉన్నారంటే నమ్ముతారా. కానీ ఇది నిజం. ఆయనే బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్(Ajay Devgan). ఈయన ఏకంగా ఎనిమిది సినిమాలను వరుస బెట్టి చేస్తుండడం విశేషం. ఇక అందులో రీసెంట్ గా ‘రైడ్ 2’ మొదలైపోయింది. రవితేజ మిస్టర్ బచ్చన్ అఫీషియల్ గా రీమేక్ చేసుకుంటున్నది దీని మొదటి భాగాన్నే కావడం విశేషం. ఇది గాక రకుల్, టబుతో ‘దే దే ప్యార్ దే 2’ పనులు ఇటీవలే షురూ చేశారు. పన్నెండేళ్ల క్రితం వచ్చిన ‘సన్ అఫ్ సర్దార్’ సీక్వెల్ కూడా కొనసాగించబోతున్నారు. ఇక ఆగస్ట్ విడుదలకు ‘సింగం అగైన్’ రెడీ అవుతోంది. ‘దృశ్యం 3’ స్క్రిప్ట్ పనులు జీతూ జోసెఫ్ కొలిక్కి తెస్తున్నారు. ఇవన్నీ గాక ఢమాల్ 4, గోల్ మాల్ 5 వంటి కామెడీ సిరీస్ లు కూడా ఈ ఏడాదే సెట్స్ పైకి వెళ్తాయి. ఇవి కాకుండా రీసెంట్ గా సైతాన్ తో హిట్టు కొట్టిన అజయ్ ప్పుడు ‘సైతాన్ 2’ని కూడా మొదలుకానుందట.

ఇండియాలో ఏకైక హీరో?

అయితే ఈ లెక్కన ఏ భాషలో చూసినా ఇన్ని సీక్వెల్స్ కి సానుకూలంగా ఉన్న ఏకైన హీరో అజయ్ అనే చెప్పాలి. పైగా వేగంగా తీయడంలో నటించడంలో పేరున్న అజయ్ దేవగన్ దర్శకుడిగానూ యుమీ ఔర్ హం, శివాయ్, భోలా, రన్ వే 34 వంటి సినిమాలతో ఈ విభాగంలోనూ తనదైన ముద్ర వేశాడు. ఇక ఆరేళ్లకు పైగా నిర్మాణంలో ఉన్న మైదాన్ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ 10 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. రంజాన్ కానుకగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ కాగానే ఒక్కో సినిమాకి సీక్వెల్ తీయడం స్టార్ట్ చేస్తారట. అయితే ముందుగా సింగం అగైన్ సినిమా పూర్తి చేసి ఆగష్టు 15న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు