టాలీవుడ్ ఇండస్ట్రీలో గత కొంతకాలంగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు నరేష్ – పవిత్ర లోకేష్. వీరు పెళ్లి చేసుకోకపోయినా సహజీవనం అంటూ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉన్నారు. వీరిద్దరి రిలేషన్షిప్ పై తాజాగా ఒక సినిమాను కూడా విడుదల చేయబోతున్నారు. ఆ మధ్య బెంగుళూరు హోటల్ లో నరేష్ – పవిత్రలు ఉంటే.. హోటల్ వద్దకు వెళ్లిన నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి నానా హంగామా చేసింది. దీంతో వీరిద్దరి వ్యవహారం వైరల్ అయింది.
ఇక ఈ ఏడాది నూతన సంవత్సరం సందర్భంగా వారి రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేస్తున్నట్లుగా లిప్ లాక్ పెట్టేసుకున్నారు, ఆ ఫోటో సోషల్ మీడియా లో హల్చల్ చేసింది. కానీ అది సినిమా ప్రమోషన్ అని ఎవరు అంతగా ఊహించలేదు. అది నిజమైన ప్రకటన అని.. వారు పెళ్లి చేసుకున్నారని అంతా అనుకున్నారు. అయితే అది “మళ్లీ పెళ్లి” అనే సినిమా ప్రమోషన్ అని తర్వాత అందరికీ అర్థమైంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఓంకార్ నిర్వహిస్తున్న సిక్స్త్ సెన్స్ షోలోకి గెస్ట్ గా వీరిద్దరూ రావడం జరిగింది.
ఇక వీరిద్దరూ ఇందులో రెచ్చిపోయి కనిపించడం మరోసారి చర్చకు దారితీసింది. ఈ షోలో పవిత్రని మీరు ముద్దుగా ఏమని పిలుస్తారు అని నరేష్ ని ఓంకార్ అడగగా.. ముద్దుగా పవిత్రని అమ్ములు అని పిలుస్తానని.. ఇంకా ప్రేమ ఎక్కువైతే అమ్ము అని, మరీ ఇంకా ప్రేమ ఎక్కువైతే ఏమని పిలుస్తానో..? అన్నారు. ఇక రిలేషన్షిప్ గురించి ప్రశ్నిస్తే.. ఆకాశం మీద పడినా, భూమి బద్దలైన మేమిద్దరం కలిసే ఉంటామంటూ నరేష్ – పవిత్ర ఇద్దరూ చేయి చేయి పట్టుకొని చూపించారు. అంతేకాదు ఒకరికొకరు ముద్దులు పెట్టుకున్నారు. దీంతో ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
For More Updates :
Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.