మజ్ఞు సినిమాతో టాలీవుడ్కి పరిచయమైన బ్యూటీ అను ఇమ్మానుయేల్. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ అల్లు శిరీష్తో డేటింగ్లో ఉన్నదంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ కలిసి ఊర్వశివో రాక్షశివో చిత్రంలో నటించారు. ఆ చిత్రానికి సంబంధించిన షూటింగ్ లేకపోయినా వీరు కలిసి తిరిగినట్టు టాక్ వినిపిస్తోంది.
ఈ విషయం గురించి అను ఇమ్మానుయేల్ని పిలిచి మరి నిర్మాత అల్లు అరవింద్ డైరెక్ట్గా అడిగేశాడట. ఊర్వశివో రాక్షసివో మూవీ ప్రమోషన్లలో భాగంగా అను ఇమ్మానుయేల్ ఈ విషయాన్ని బయటపెట్టింది. “శిరీష్తో నేను ప్రేమలో ఉన్నానంటూ వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈ మూవీ ఓపెనింగ్ పూజలోనే నేను శిరీష్ని కలిశాను. ఆ తరువాత మూవీ కోసం ఒక సారి కాఫీ షాప్లో కలిసి మాట్లాడుకున్నాం. ఆ మాత్రానికే డేటింగ్ అంటూ వార్తలు రాసేశారు.
ఇక అల్లు అర్జున్తో నా పేరు సూర్య సినిమాలో నటించాను. అప్పటి నుంచి అల్లు కుటుంబంతో నాకు మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చింది. అల్లు అరవింద్ కూడా ఒకసారి నన్ను నా కొడుకుతో డేటింగ్లో ఉన్నావా అని అడిగారు. ఆ తరువాత చాలా సేపు దీని గురించి మాట్లాడి నవ్వుకున్నాం” అంటూ చెప్పుకొచ్చింది అను ఇమ్మానుయేల్. ఈమెతో పాటు అల్లు శిరీష్ కూడా డేటింగ్ వార్తలపై ఖండించాడు. ప్రస్తుతం ఊర్వశివో రాక్షశివో సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. థియేటర్లలో యువతనే ఎక్కువగా కనిపించడం విశేషం.