Tamannah Bhatia : టాలీవుడ్ లో ఒకప్పుడు మిల్కి బ్యూటీ తమన్నా క్రేజ్ వేరేగా ఉండేది. స్టార్ హీరోల సినిమాలకు కూడా డేట్లు ఇవ్వలేనంత బిజీ అయిన ఈ అమ్మడు ఇప్పుడు టాలీవుడ్ లో చిన్న సినిమాలు చేసుకునే పరిస్థితి వచ్చేట్టు ఉంది. అయితే మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో శ్రీ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా రెండు దశాబ్దాలు దగ్గర కావస్తుంది. హ్యాపీ డేస్ హిట్ తో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా కెరీర్ లో ముందుకు సాగింది. దాదాపు టాలీవుడ్ టాప్ స్టార్స్ అందరితోనూ నటించింది తమన్నా. అయితే గత కొన్నాళ్లుగా తమన్నా టాలీవుడ్ కి దూరమైనా, లాస్ట్ ఇయర్ భోళా శంకర్, సినిమాతో పలకరించింది. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. అయితే ఈ మధ్య కాలంలో మిల్కీ బ్యూటీ తమన్నా కు కాస్త తక్కువ ఆఫర్లు వస్తుండటంతో తమన్నా పనైపోయింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ తమన్నా సినిమాల లైనప్ చూస్తే అది కాదని తెలుస్తుంది. అయితే తమన్నా తో ఎంట్రీ ఇచ్చిన కాజల్, సమంత లాంటి హీరోయిన్లు సినిమాలతో బిజీ అయితే , తమన్నా మాత్రం సినిమాల కంటే వెబ్ సిరీస్ లతో బిజీ అవుతుంది.
సినిమాల కంటే వెబ్ సిరీస్ తో బిజీ..
అయితే తమన్నాకు ఇన్నాళ్లు సినిమాల్లో ఆఫర్లు రావడం గొప్ప విషయమనే చెప్పాలి. పనైపోయింది అనుకున్న ప్రతి సారి ఏదో ఒక విధంగా లేస్తూనే ఉంది. ఇక తమన్నా సైలెంట్ గా సైడ్ అయ్యి ఫ్యామిలీ లైఫ్ లో సెటిల్ అయితే మంచిది అంటూ కొందరు ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. కానీ తమన్నా మాత్రం వాటిని పట్టించుకోకుండా వచ్చిన ప్రతి ఆఫర్ ను సద్వినియోగం చేసుకుంటూ సత్తా చాటుతూనే ఉంది. ఒక వైపు హీరోయిన్ గా నటిస్తూనే, మరో వైపు స్పెషల్ సాంగ్స్ చేస్తూ, మరో వైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ వచ్చింది. ముఖ్యంగా వెబ్ సిరీస్ లలో తమన్నా ఇప్పుడు యమా బిజీ అవుతుంది. తాజాగా ఈ అమ్మడికి మరో బిగ్ ప్రాజెక్ట్ లో ఛాన్స్ దక్కింది. ఈ ఆఫర్ తో తమన్నా మరో అయిదేళ్ల కెరీర్ ను కంటిన్యూ చేయవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.బాలీవుడ్ లో టాయిలెట్, ఎమ్మెస్ ధోని వంటి చిత్రాలను నిర్మించిన దర్శకుడు నీరజ్ పాండే ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ కోసం వర్క్ చేస్తున్నాడు. ఇప్పటికే ది ఫ్రీలాన్సర్ వంటి వెబ్ సిరీస్ తో మెప్పించిన నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందబోతున్న కొత్త వెబ్ సిరీస్ లో మిల్కీ బ్యూటీ తమన్నా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నట్లుగా బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
చేతినిండా సినిమాలు, వెబ్ సిరీస్ లు..
అయితే నీరజ్ పాండే దర్శకత్వంలో రాబోయే సిరీస్ ముంబయిలో జరిగే క్రైమ్ కథతో రూపొందనుండగా ఈ వెబ్ సిరీస్ ను దర్శకుడు నీరజ్ పాండే స్వయంగా నిర్మిస్తూ రూపొందించబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. ఈ ఏడాదిలోనే ఈ వెబ్ సిరీస్ ను పూర్తి చేయబోతున్నారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ గురించి మరిన్ని వివరాలు తెలియజేయబోతున్నారట. ప్రతిష్టాత్మక నీరజ్ పాండే వెబ్ సిరీస్ లో ఛాన్స్ దక్కించుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇన్నాళ్లు మా తమన్నా పనైపోయిందంటూ విమర్శించిన వారికి ఇదే సమాధానం అన్నట్లుగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక తెలుగులో ఓదెల 2 లో నటిస్తున్న తమన్నా తమిళ్ లో మరో రెండు సినిమాలతో బిజీ అవుతుంది.