Bigg Boss Season7: రతిక మా కొడుకుని వాడుకుంది.. పల్లవి ప్రశాంత్ తల్లి షాకింగ్ కామెంట్స్

Bigg Boss Season7

బిగ్ బాస్ సీజన్ 7 లో పల్లవి ప్రశాంత్ పేరు మార్మోగిపోతుంది. ఈ సీజన్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారిపోయాడు పల్లవి ప్రశాంత్. ఓ సాధారణ రైతుబిడ్డగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ తో దూసుకుపోతున్నాడు. వారం వారం జరిగే ఓటింగ్ లో కూడా పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉంటున్నాడు. హౌస్ లో మొదటివారం రితికతో లవ్ ట్రాక్ వల్ల ప్రశాంత్ పేరు బాగా వినిపించగా.. పల్లవి ప్రశాంత్ ఓవర్ యాక్షన్ తో హౌస్ మేట్స్ అందరూ అతడిని టార్గెట్ చేశారు.

దాంతో మనోడిపై అందరికీ సింపతి పెరిగింది. ఇదిలా ఉంటే.. తాజాగా ప్రశాంత్ తల్లిదండ్రులు ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతడి తల్లి మాట్లాడుతూ.. ” నా కొడుకు బిగ్ బాస్ షో కి వెళ్ళినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ అమర్ దీప్ నా కొడుకును ఏందిరా అన్నందుకు చాలా బాధేసింది. నా కొడుకు ఓ రైతు అని అందరూ హేళన చేస్తున్నారు.

నాకు అది చాలా బాధేసింది. నాకు ఇది ఉంది, అది ఉంది అని విర్రవీగద్దు. హౌస్ లో అందరూ సమానమే. పల్లవి ప్రశాంత్ తల్లిగా నేను ఎంతో సంతోషపడుతున్నాను. మాది చాలా పేద కుటుంబం. తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. ప్రశాంత్ కు నటన అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే ఓ పాట తీస్తే 7 లక్షలు వచ్చాయి. ఆ డబ్బులను నా కొడుకు స్నేహితులు తీసుకొని మోసం చేశారు. అప్పుడు నా కొడుకు చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత అప్పు చేసి నా కొడుకుకి ఓ ఫోన్ కొన్నాను.

- Advertisement -

ఆ ఫోన్ లో తీసిన వీడియోలతోనే నా కొడుకుకి ఈరోజు బిగ్ బాస్ వరకు వెళ్లే అవకాశం దక్కింది” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రశాంత్ – రతిక గురించి అడగగా.. ” నా కొడుకుని రతిక వాడుకుంది. ప్రశాంత్ తో మంచిగా ఉంటే.. అతడికి వచ్చే ఓట్లు కూడా తనకి వస్తాయని ప్లాన్ చేసింది. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక పల్లవి ప్రశాంత్ కు పెళ్లి చేస్తాం. ఆయన కప్ కొట్టుకొచ్చిన సరే.. కొట్టుకురాకపోయినా పరవాలేదు. నాగార్జున ని కలవడవే మాకు విజయం” అంటూ చెప్పుకొచ్చింది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు