పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మైథలాజికల్ మూవీ “ఆదిపురుష్” బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. జూన్ 16 న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందనను సొంతం చేసుకున్నా భారీ ఓపెనింగ్స్ దక్కించుకుంది. రామాయణ కథాంశం ఆధారంగా తెరకెక్కించిన సినిమా కావడంతో ఈ సినిమా కు టాక్ బాగా లేనప్పటికీ ప్రేక్షకులు వీకెండ్ లో ఆదరించారు. మొదటిరోజే భారీ ఓపెనింగ్స్ కొల్లగొట్టిన ఈ సినిమా ఫస్ట్ డే 137 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. వచ్చిన నెగిటివ్ టాక్ కు రెండో రోజు ఆడియన్స్ దెబ్బేస్తారనుకుంటే సెంటిమెంట్ తో ఆరోజు 80 కోట్లు రాబట్టింది.
ఇక ఇప్పుడు మూడో రోజు ఆదివారం వీకెండ్ కావడంతో మరింత జోరు చూపించి అదరగొట్టింది. మూడో రోజు ఏకంగా 84 కోట్లకి పైగా వసూలు చేసి రామనామం పేరు నిలబెట్టింది. మూడోరోజు ఏరియా వైస్ గా లెక్కచూస్తే అన్నిటికంటే ఎక్కువగా నైజాం లో భారీ ఓపెనింగ్స్ సాధించి దుమ్ములేపింది. మూడో రోజు ఇక్కడ 8.31 కోట్లు వసూలు చేసింది.
ఏరియా వైస్ గా మూడు రోజుల లెక్క గమనిస్తే.. ఏపీ, నైజాం: 64.95 కోట్లు షేర్103.30CR గ్రాస్ రాబట్టింది. ఇక కర్ణాటకలోనూ 10కోట్లకి పైగా వసూలు చేయగా, తమిళనాడు, కేరళ కలిపి 2 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్ లో 19 కోట్లు హిందీలో 54.80 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓవరాల్ గా విడుదలైన మూడు రోజుల్లో ఆదిపురుష్ ప్రపంచ వ్యాప్తంగా 151 కోట్ల షేర్ 302.50 కోట్ల గ్రాస్ వసూలుచేసి ఆశర్యపరిచింది. 2/5 రేటింగ్ తెచ్చుకున్న సినిమా మూడు రోజుల్లోనే 300 కోట్లు రాబట్టడమంటే అది రాముడి సెంటిమెంట్ బలమే అని చెప్పొచ్చు. కానీ అసలు కథ ఇప్పుడే ఉంది. వీకెండ్ కాబట్టి పిల్లలతో కలిసి ఫ్యామిలీ ఆడియన్స్ అండతో ఎలాగో గట్టెక్కింది. కానీ ఇప్పుడు వర్కింగ్ డేస్ స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఆదిపురుష్ ఇకపై తన జోరు ఎలా చూపిస్తాడో చూడాలి.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News