Bigboss troll: ఈ సీజన్లో అమ్మాయి బదులు అబ్బాయి?

Bigboss troll:

తెలుగులో బిగ్ బాస్ 7 సందడి మొదలై 4 రోజులైనా ఇంకా రసపట్టు రావడం లేదు. దానికి కారణం ఈ సీజన్లో ఎక్కువ మంది కొత్త వారు కావడమే. అయితే కొత్తవారు ఆడియన్స్ కి కనెక్ట్ కావడానికి కొంత సమయం అయితే పడుతుంది. ఈ లోపు బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులను ఆకర్షించడానికి కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తూ టాస్క్ లని ఇస్తున్నారు.

అయితే అసలు విషయానికొస్తే తెలుగు బిగ్ బాస్ లో ప్రతి సీజన్లో కంటెస్టెంట్స్ లో ఎవరో ఒకరు ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు. అందులో కొందరు ఇన్నోసెంట్ గా ఉంటే, మరికొందరు కావాలని ఏడుస్తారు. అంటే ప్రతి చిన్నదానికి అలుగుతూ, వాగ్వాదానికి దిగుతారు. చివరికి వాళ్ళ వల్ల ఏం కాకపోతే అలక మొహం వహిస్తారు. ఇక కొందరు జెన్యూన్ గానే ఉన్నా, పరిస్థితుల ప్రభావం వల్ల అందరితోనూ కలవక అపార్ధం చేసుకుంటారు.

ఈ సీజన్లో కూడా అలా ఎవరైనా ఉన్నారా అంటే అప్పుడే చెప్పలేం. కానీ షో లో అందరితో తొందరగా కలవలేక (రైతు బిడ్డ) ప్రశాంత్ సతమతవుతున్నాడు. ఆడియన్స్ నుండి ట్రోల్స్ ఎక్కువగా ఎదుర్కుంటున్న వ్య్తకి ఇతనే. ఎందుకంటే షో లోకి వచ్చాక తాను చేసే డ్రామా మరీ అతి చేస్తుంది. అన్నం మెతుకులు, నెల మీద పడుకోవడం ఇది ఓవర్ అనిపించింది. ఇవన్నీ పక్కన పెడితే తాను మాట్లాడే మాటల్లో ఏడుపొక్కటే తక్కువ అన్నట్టు అనిపిస్తుంది.

- Advertisement -

అందుకే ఈ సీజన్లో పల్లవి ప్రశాంత్ అలక మారాజు అవుతాడని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే గత సీజన్లో శివజ్యోతి, మోనాల్ గజ్జర్ వంటి వారు ఏడుపు మొహంతో ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. ఈ సారి అమ్మాయి బదులు అబ్బాయి అవుతాడని అంటున్నారు. అయితే రానున్న రోజుల్లో ప్రశాంత్ ప్రవర్తన లో మార్పు రాకపోతే నెక్స్ట్ ఎలిమినేషన్ లో తనే అయ్యే ఛాన్స్ ఉంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు