Parijatha parvam OTT: మరికొన్ని గంటల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Parijatha parvam OTT: ఓటీటీలోకి ఎన్నో మూవీలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇక ఈమధ్య తెలుగులో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు వచ్చి ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి. అయితే థియేటర్లలో రిలీజ్ అయిన కొన్ని రోజుల్లో డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నాయి.

కానీ ఓ మూవీ మాత్రం రెండు నెలల అనంతరం ఓటిటిలోకి వస్తుంది. ఆ సినిమా పేరే పారిజాత పర్వం. బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్ధదాస్ హీరోయిన్ గా.. హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న చైతన్య రావు, పాపులర్ కమెడియన్, విలన్, హీరో అయినా సునీల్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ నే పారిజాత పర్వం. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీకు సంతోష్ దర్శకత్వం వహించారు.

Thriller movie coming to digital streaming in a few hours
Thriller movie coming to digital streaming in a few hours

మంచి అంచనాలతో ఏప్రిల్ 19న ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. కిడ్నాప్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు పెద్దగా ప్రేక్షకు ఆదరణ దక్కలేదు. ఇక బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. అది కూడా మరికొన్ని గంటల్లోనే. అంటే ఈ మూవీ జూన్ 12 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కి రానుంది. ప్రముఖ తెలుగు సంస్థ ఆహా లో ఈ మూవీ జూన్ 12 అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు