Sarkaru Vaari Paata : డైరెక్ట్ గా రిలీజ్ చేస్తే బాగుండేది

మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘సర్కారు వారి పాట’ చిత్రం మే 12న రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ మూవీ మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకుంది. అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం బాగానే ఆడుతూ వచ్చింది. ఈ చిత్రం విడుదలై  3 వారాలు పూర్తి కావస్తున్నా కలెక్షన్లు మాత్రం తగ్గలేదు. కానీ, సడన్ గా ఈ మూవీని పే పర్ వ్యూ పద్ధతిలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేసేశారు. ఈ చిత్రాన్ని చూడాలి అంటే రూ.199 చెల్లించాలి. అది కూడా రెండు రోజుల పాటు మాత్రమే వాలిడిటీ ఉంటుంది.

సినిమా ఇంకా థియేటర్ లో రన్ అవుతున్న సమయంలో ఇలా చేయడం వల్ల కలెక్షన్ల పై ప్రభావం చూపే అవకాశముంది. పోనీ ఓటీటీ లో ప్రేక్షకులు డబ్బులు కట్టి చూస్తారా అంటే అదీ ఉండదు. అందుబాటులో ఉన్న పైరసీ వెబ్సైట్లలో డౌన్లోడ్ చేసుకుని చూస్తారు. ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ విషయంలో కూడా ఇదే జరిగింది. తర్వాత ఓటిటిలో ఫ్రీగా చూసుకునే అవకాశం ఉన్నా, జనాలు నెట్ వేస్ట్ చేయడం ఎందుకు అని ఇప్పటికే డౌన్లోడ్ చేసుకున్న దాన్నే చూస్తారు. అప్పుడు వ్యూయర్ షిప్ కూడా ఎక్కువ నమోదు కాదు. మొత్తంగా సర్కారు వారి ఆలోచన వల్ల నష్టమే తప్ప లాభం పెద్దగా ఉండకపోవచ్చు

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు