OTT Movie : ప్రేమ పేరుతో అంధుడిని మోసం చేసే కిలాడి లేడీ … ఆరేళ్ల తరువాత ఓటీటీలోకి తాప్సి మూవీ

OTT Movie : నిన్ను కోరి, రంగస్థలం, సరైనోడు లాంటి సినిమాలతో తెలుగు ఇండస్ట్రిలో కూడా నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న తమిళ హీరో ఆది పినిశెట్టి. ఈ హీరో నటించిన నీవెవరో అనే మూవీ ఆరేళ్ళ తర్వాత ఓటీటీలోకి అడుగు పెట్టింది. ఈ మూవీ స్ట్రీమింగ్ ఎందుకు లేట్ అయ్యింది? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళ్తే..

ఓటిటి ఎంట్రీ లేట్…

నీవెవరో మూవీకి కోన వెంకట్ కథ అందించగా, హరినాథ్ దర్శకత్వం వహించారు. తాప్సి, రితిక సింగ్ హీరోయిన్లుగా నటించగా, కోన ఫిలిం ఫ్యాక్టరీ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించారు. 2019లోనే రిలీజ్ అయిన నీవెవరో మూవీకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ దక్కింది. సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఈ మూవీ బాగానే ఆకట్టుకుంది. కానీ ఓటిటి ఎంట్రీకి మాత్రం దాదాపు ఆరేళ్ల టైం పట్టింది. 2019లో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ మూవీ ఓటిటిలోకి ఇంత లేటుగా ఎందుకు వచ్చింది అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ఏదైతేనేం ఇన్నేళ్లకు ఓటీటీలోకి వచ్చింది అదే చాలు అంటున్నారు మూవీ లవర్స్. మరి ఈ మూవీకి ఓటీటీ లవర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

నీవెవరో మూవీ స్టోరీ

కళ్యాణ్, అను చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే ఓ ప్రమాదం కారణంగా 15 ఏళ్ల వయసులోనే కళ్యాణ్ చూపు కోల్పోతాడు. అయినప్పటికీ అతను చెఫ్ గా రెస్టారెంట్ రన్ చేస్తాడు. మరోవైపు అను జర్నలిస్ట్ గా పని చేస్తుంది. ఆమె కళ్యాణ్ ను ప్రేమిస్తుంది. అయితే ఓ రోజు రాత్రి రెస్టారెంట్ కి వచ్చిన వెన్నెలపై కళ్యాణ్ మనసు పారేసుకుంటాడు. అలా దగ్గరైన వెన్నెల కళ్యాణ్ కు తను ఆపదలో ఉన్నాననే విషయాన్ని చెప్తుంది. కాల్ మనీ బారిన పడిన వెన్నెలను ఆదుకుంటాను అని మాటిస్తాడు కళ్యాణ్.

- Advertisement -

అయితే రెస్టారెంట్ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ సందర్భంలో యాక్సిడెంట్ జరుగుతుంది. ఈ ప్రమాదం అనంతరం కళ్యాణ్ కు మళ్లీ చూపు తిరిగి వస్తుంది. కానీ ఆ తర్వాత వెన్నెల మాత్రం కనిపించదు. మరి వెన్నెల ని కళ్యాణ్ ఎలా కనుగొన్నాడు? ఆమెను కనుక్కోవడానికి చేసిన ప్రయత్నంలో కళ్యాణ్ కు ఎలాంటి నిజాలు తెలిసాయి? చివరకు వెన్నెల, అను, కళ్యాణ్ కథ ఎక్కడికి చేరింది? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూసి తీరాల్సిందే. అప్పట్లో థియేటర్లలో మిస్ అయినవాళ్లు ఈ సినిమాను ఓటీటీలో తప్పకుండా మిస్ కాకుండా చూడండి.

తాప్సీనే మెయిన్ హైలెట్

ఈ సినిమాలో తాప్సీ పాత్ర అందరి కంటే హైలెట్ గా ఉంటుంది. రితికా పాత్ర కంటే తాప్సీ పాత్రకే ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఆమెను ఇందులో ఊహించని షేడ్ లో చూపించి షాక్ ఇచ్చారు మేకర్స్. స్టోరీ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు