STR48: తెలుగు ప్రేక్షకులకు శింబు గురించి కొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. చాలామంది తమిళ్ హీరోస్ కంటే ముందే తెలుగులో మంచి ఫ్యాన్ బేస్ ని సాధించుకున్నాడు శింబు. శింబు చేసిన ఎన్నో సినిమాలు తెలుగులో మంచి హిట్ అయ్యాయి. ఇప్పటికి కూడా శింబు పాత సినిమాలు కు మంచి డిమాండ్ ఉంటుంది. మంచి కాన్సెప్ట్ సినిమాలును ఎంచుకుంటాడు. కొత్త కథలను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తాడు అని శింబుపైన అందరికీ ఒక మంచి ఒపీనియన్ ఉంది.
ప్రస్తుతం శింబు ప్రాజెక్ట్స్
శింబు ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో ఉలగనాయగన్ కమల్ హాసన్తో పాటు “థగ్ లైఫ్” సినిమాలో నటిస్తున్నారు. శింబు మరో చిత్రం “STR 48” ఒక సంవత్సరం పాటు ప్రీ-ప్రొడక్షన్లో ఉంది. ప్రస్తుతం “STR 48” సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
ఇద్దరు హీరోయిన్లు
‘STR 48’ జూన్లో ప్రారంభం కానుందని సమాచారం. హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శింబు రెండు పాత్రలలో కనిపించనున్నారు. శింబు రెండు పాత్రల్లో కనిపించడంతో ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. దీనికోసం బాలీవుడ్ నటీమణులు జాన్వీ కపూర్ మరియు కియారా అద్వానీలతో చిత్ర యూనిట్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
బిగ్గెస్ట్ ప్రాజెక్ట్
‘STR 48’ సినిమాను దేశీసింగ్ పెరియసామి రచించి దర్శకత్వం వహిస్తున్నారు. ఉలగనాయగన్ కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ శింబు కెరీర్లోనే అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పుకోవచ్చు. ఇది తమిళ్ ఇండస్ట్రీలో బాహుబలి రేంజ్ అని కొంతమంది అభిప్రాయం. అయినా ఎవరి ఇండస్ట్రీ అంటే వారికి ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. బాహుబలి లాంటి సినిమాతో పోల్చారు అంటే ఆ ప్రాజెక్టు పైన ఉన్న నమ్మకం కావచ్చు. కానీ బాహుబలిని కొట్టాలి అని అంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంత బాగా బాహుబలి సినిమాను తెరకెక్కించారు రాజమౌళి. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.