ఇండియా లో లాక్ డౌన్ తర్వాత ఓటిటి ల వాడకం ఎక్కువైందన్న సంగతి తెలిసిందే. అయితే ఓటిటి లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా ఓ రేంజ్ లో చూస్తుంటారు జనాలు. అయితే ఒకప్పుడు ఈ వెబ్ సిరీస్ లకు అంతగా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు. వచ్చే వెబ్ సిరీస్ లు కూడా షార్ట్ ఫిల్మ్స్ లా ఉండేవి. కానీ ఓటిటి లో వెబ్ సిరీస్ లకి ఓ రేంజ్ హైప్ ని ఊపుని తీసుకొచ్చింది మాత్రం మీర్జాపూర్ సిరీసే. సినిమాలకి ఏమాత్రం తక్కువ కానీ రేంజ్ లో కమర్షియల్ గా ఉంటుంది ఈ సిరీస్. అయితే ఈ సిరీస్ లో బూతు డైలాగ్స్ కొన్ని అడల్ట్ సీన్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆడియన్స్ అప్పట్లో ఎగబడి చూసారు. ఈ సినిమాతోనే పంకజ్ త్రిపాఠి లాంటి విలక్షణ నటుడికి బ్రేక్ వచ్చింది. గతంలో మీర్జాపూర్ పేరిట రెండు సిరీస్ లు రాగా, మూడో సిరీస్ పై ఫుల్ హైప్ పెంచేసారు. చాలా రోజులుగా మీర్జాపూర్ 3 కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కి ఇప్పుడు గుడ్ న్యూస్ ఇచ్చారు మేకర్స్. త్వరలోనే గుడ్డూ భయ్యా మళ్లీ వచ్చేస్తున్నాడు.
గుడ్డు పంకజ్ త్రిపాఠి రివెంజ్ కి రెడీ..
మీర్జాపూర్ సిరీస్ ఎంత ఫెమస్సో అందులోని క్యారెక్టర్ల పేర్లు కూడా బాగా ఫేమస్. ముఖ్యంగా మున్నా భయ్యా, గుడ్డూ భయ్యా, బబ్లూ, త్రిపాఠిల పేర్లు బాగా వైరలయ్యాయి. అయితే మోతాదుకు మించి హింస, రొమాన్స్, ఇంకా బూతు డైలాగ్స్ ఉండడం మీర్జాపూర్ సిరీస్లో ప్రతికూలాంశం. కానీ వీటివల్లే యూత్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారని కూడా చెప్పొచ్చు. ఒక్క హిందీలోనే కాదు తెలుగులో కూడా ఈ సిరీస్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఇక మొదటి సీజన్లో మున్నా కారణంగా గుడ్డూ, తన తమ్ముడు బబ్లూ, భార్య శ్వేతలు బాగా ఇబ్బంది పెట్టడం, వాళ్ళు చనిపోవడం చూపించారు. అదే రెండో సీజన్ లో మున్నాపై గుడ్డూ రివేంజ్ తీర్చుకున్నాడో చూపించారు. ఆ పార్ట్ లో మున్నా చనిపోతున్నట్టు చూపించి ఎండ్ చేసి పంకజ్ త్రిపాఠి, గుడ్డు ల మధ్య రివెంజ్ ఉంటుందని ఎండ్ చేసి, మూడో పార్ట్ పై మరింత ఆసక్తికరంగా అంచనాలు పెంచేశారు. ఇక రెండో సీజన్లో తమన్నా ప్రియుడు విజయ్ వర్మ ఒక కీలక పాత్ర పోషించాడు. మూడో సీజన్లో కూడా అతని పాత్ర మలుపు తిప్పనుంది.
అమెజాన్ ఈవెంట్ వేదికగా మిర్జాపూర్ 3 కమింగ్..
ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా రెండు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ మూడో సీజన్ రిలీజ్కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం మిర్జాపూర్ 3 షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయిందట. ఇక ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ పనులు కూడా జరుపుకొంటోందట. అన్నీ సవ్యంగా కుదిరితే మార్చి చివరి వారంలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మీర్జా పూర్ సీజన్ 3 స్ట్రీమింగ్ కానుందని సమాచారం. తాజాగా అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ వేదిక గా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్.
ఇక ఉత్తరప్రదేశ్లో మిర్జాపూర్ నగరం నేపథ్యంలో ఒక క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్ సిరీస్గా ఇది తెరకెక్కింది. పంకజ్ త్రిపాఠి, శ్వేతా త్రిపాఠి, దివ్యేందు శర్మ, అలీ ఫజల్, శ్రియ పిల్గోంగర్, హర్షిత గౌర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఏడేళ్ల కింద 2018 నవంబరు 16న మీర్జాపూర్ మొదటి సీజన్ రిలీజ్ కాగా ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. ఇండియాలో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న వెబ్ సిరీస్ లలో ఒకటిగా నిలిచింది. ఇక దీని రెండో పార్ట్ 2020 అక్టోబరు 23న మీర్జాపూర్ స్ట్రీమింగ్ కు రాగా, ఇది మొదటి పార్ట్కు మించి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు మీర్జాపూర్ మూడో సీజన్ కోసం ఓటీటీ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మూడో సీజన్ వస్తుందని అనౌన్స్ చేసినా రిలీజ్ డేట్ ఇంకా సస్పెన్స్ లో ఉంచారు.
Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.