Adavi Sesh: ఈ సినిమాని పవన్ కళ్యాణ్ కి చూపిస్తా

ఒకప్పుడు ఒక సామాన్య మానవుడు ఒక సెలెబ్రిటీతో మాట్లాడటం అంటే మాములు విషయం కాదు. కానీ సోషల్ మీడియా వచ్చాక అది సర్వ సాధారణం అయిపోయింది. ఇప్పుడు కొందరు సెలబ్రిటీష్ ను ట్యాగ్ చేసి మరీ ట్రోల్ చేస్తుంటారు. వీటికి కొందరు స్పదించకుండా తమ పని చేసుకుంటూ ఉంటారు. కానీ ఇంకొందరు అవతల వ్యక్తి తిరిగి మాట్లేడే అవకాశం లేకుండా రిప్లై ఇస్తారు. ఈ మధ్యకాలంలో అడవి శేష్ అలానే చేస్తున్నారు.

అడవి శేష్ నటించిన మేజర్ సినిమా జూన్ 3న రిలీజ్ కి సిద్ధంగా ఉంది.
ఇదే రోజు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేసిన “విక్రమ్” అక్షయ్ కుమార్ నటించిన “పృథ్వీరాజ్” సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. ఈ సందర్బంగా మిగతా సినిమాలతో మీకు ఎలాంటి పోటీ ఉంటుంది అని అడిగిన ప్రశ్నకు

తెలుగు లో మాది పెద్ద సినిమా
హిందిలో పృథ్వీరాజ్ పెద్ద సినిమా
తమిళ్ లో విక్రమ్ పెద్ద సినిమా అని చెప్తూ సముద్రంలో ఎన్ని పెద్ద చేపలైన ఉండొచ్చు కానీ మా సినిమా ఒక గోల్డ్ ఫిష్ అని చెప్పుకొచ్చాడు శేష్.

- Advertisement -

ఒక నెటిజన్ ట్విట్టర్ వేదికగా అడవి శేష్ ను ట్యాగ్ చేసి సో నువ్వు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అనుకుంటున్నావా అని అడిగిన ప్రశ్నకు.
ఐ థింక్ మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ ఇజ్ ఆల్ ఇండియా హీరో అని తనదైన శైలిలో ధీటుగా సమాధానం ఇచ్చాడు శేష్.

ఈ సందర్భంలోనే పవన్ కళ్యాణ్ కి ఈ సినిమాను చూపించండి అని చెప్పిన అభిమానికి పక్కా అంటూ రిప్లై ఇచ్చాడు శేష్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు