Ram Charan : లోకేష్ కనగరాజన్ కు పెద్ద పరీక్షే..!

కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ వంటి స్టార్ హీరోలు కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘విక్రమ్’. కమల్ హాసన్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. లోకేష్ కనగరాజన్ దర్శకుడు. టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. కచ్చితంగా ఈ సినిమా హిట్ అనే నమ్మకం జనాలకి కలిగింది. అయితే ఈ చిత్రం విజయం సాధించడం ఈ హీరోలకి ఏమో కానీ దర్శకుడు లోకేష్ కనగరాజన్ కు మాత్రం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సినిమా హిట్ అయితేనే టాలీవుడ్లో అతనికి స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం దక్కుతుంది.

ముఖ్యంగా రామ్ చరణ్.. లోకేష్ తో సినిమా చేయాలని ‘ఖైదీ’ రిలీజ్ అయినప్పుడే ఫిక్స్ అయ్యాడు. ‘మాస్టర్’ తర్వాత ఈ కాంబో ఫిక్స్ అని అంతా అనుకున్నారు. కాకపోతే ‘మాస్టర్’ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో వెనకడుగు వేశాడు చరణ్. ఇప్పుడు విక్రమ్ కనుక హిట్ అయితే లోకేష్ కు చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. రాంచరణ్ కు లోకేష్ వినిపించింది ఓ మల్టీస్టారర్ కథ. చరణ్ తో పాటు ఆ ప్రాజెక్టులో మరో హీరోకి కూడా అవకాశం ఉంటుంది. ‘విక్రమ్’ కనుక హిట్ అయితే మరో క్రేజీ మల్టీస్టారర్.. సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంటుంది అని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు