SSMB29: ట్రిపుల్ ఆర్ కంటే ట్రిపుల్ డోస్… విజేంద్ర ప్రసాద్ బిగ్ ప్లాన్ ?

రాజమౌళి, మహేష్ సినిమాపై రైటర్ విజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. గతంలో ఆయన చెప్పినట్టు జులై చివరికల్లా మహేష్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ను రాజమౌళి చేతిలో పెడతాను అని చెప్పగా, మరీ ఆయన అనుకున్నట్టుగా స్క్రిప్ట్ ఫినిష్ చేసాడో ఏమో గానీ మహేష్ సినిమాపై ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తోంది.

ఒక టివి ఛానల్ లో వాయిస్ లైవ్ లోకి వచ్చిన విజేంద్ర ప్రసాద్.. మహేష్ సినిమా గురించి యాంకర్ అడగ్గానే చాలా కాన్ఫిడెంట్ గా సమాధానం చెప్పాడు. ఆర్ఆర్ఆర్ సినిమాకి ముందు కేవలం ఇండియా మాత్రమే రాజమౌళి సినిమాల కోసం ఎదురు చూసేది. ఇప్పుడు ప్రపంచం మొత్తం రాజమౌళి మూవీ కోసం వెయిట్ చేస్తుంది. ఇప్పుడు మహేష్ ఆయన చేయబోయే సినిమా కూడా ఆర్ఆర్ఆర్ ను మించి ఉంటుందా లేక ఆర్ఆర్ఆర్ రేంజ్ లో ఉంటుందా అని యాంకర్ అడగగా విజేంద్ర ప్రసాద్ ఈ విధంగా సమాధానం చెప్పాడు.

“ఆర్ఆర్ఆర్ సినిమా కంటే చాలా చాలా చాలా… ఎక్కువగా ఉండబోతుంది” అని చెబుతూ ట్రిపుల్ ఆర్ సినిమాకు సీక్వెల్ కూడా రెడీ ఆయన చేస్తున్నట్టు ఆ సినిమాపై కూడా తొందర్లోనే కన్ఫర్మేషన్ ఇస్తాం అని ఆయన అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు వరల్డ్ వైడ్ క్రేజ్ రావడం వల్ల ఆ సినిమాను హాలీవుడ్ స్టాండడ్స్ తో తీయబోతున్నట్టు ఆయన క్లారిటీ ఇచ్చాడు. అలాగే మహాభారతం కూడా ప్లానింగ్ దశలో ఉన్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. మరీ ఈ ప్రాజెక్ట్ లన్ని ఎప్పుడు కార్యరూపం దాల్చుతాయో గాని విజేంద్ర ప్రసాద్ చెప్పిన మాటలు అయితే ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు