Varalakshmi Sarathkumar: డ్రగ్స్ కేసులో అరెస్ట్ పై ఘాటుగా స్పందించిన వరలక్ష్మీ శరత్ కుమార్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ విలన్ గా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక గుర్తింపుని ఏర్పరచుకుంది హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్.. మొదటగా ఎన్నో చిత్రాలలో హీరోయిన్ గా నటించినా సక్సెస్ కాకపోవడంతో లేడీ విలన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్లను మించి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.. మొదట రవితేజ నటించిన క్రాక్ సినిమాతో తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. విలన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ అందుకుంది. ఈ సినిమాలో జయమ్మ పాత్రతో భారీ క్రేజ్ రావడంతో వరుసగా అలాంటి అవకాశాలే అందుకుంది. వరలక్ష్మి శరత్ కుమార్ కు సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ తనకంటూ ఒక గుర్తింపును ఏర్పరచుకుంది.

అలాగే బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో కూడా కీలకమైన పాత్రలో నటించింది ఈ ముద్దుగుమ్మ. బాలయ్య చెల్లెలు పాత్రలో అద్భుతంగా నటించి.. తన నటనతో అందరిని మెస్మరైజ్ చేసింది.. ప్రస్తుతం తెలుగు, తమిళ్ భాషలలో నటిస్తూ బిజీగా ఉన్న వరలక్ష్మీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. తాను ప్రేమించిన వారితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకొని ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. పైగా అతడి గురించి తెలిసి మరింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. ఎందుకంటే అప్పటికే అతడికి వివాహమై విడాకులు అయ్యాయట.. అలాంటి వ్యక్తితో ఏడు అడుగులు వేయబోతుండడంతో అభిమానుల సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం..

డ్రగ్స్ కేసులో వరలక్ష్మి..
గతంలో కూడా వరలక్ష్మీ శరత్ కుమార్ పైన డ్రగ్స్ కేస్ ఆరోపణలు ఎక్కువగా వినిపించాయి.. వాటన్నిటిని ఖండిస్తూ గతంలో వివరణ ఇచ్చింది.. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ వార్తలు వైరల్ కావడంతో మరొకసారి ఘాటుగానే స్పందించింది.

- Advertisement -

డ్రగ్స్ కేసు పై క్లారిటీ..
వరలక్ష్మి శరత్ కుమార్ దగ్గర మేనేజర్ గా పనిచేసిన ఆదిలింగం అనే వ్యక్తిని డ్రగ్స్ కేసులో పోలీసులు పట్టుకోవడంతో వరలక్ష్మి శరత్ కుమార్ పైన పలు రకాల ఆరోపణలు వినిపించాయి.. డ్రగ్స్ కేసులో వరలక్ష్మికి కోర్టు సమన్లు కూడా జారీ చేస్తోందని.. ఆమె విచారణకు కూడా హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారని రూమర్స్ వినిపించాయి.. మరి కొంతమంది అయితే ఏకంగా వరలక్ష్మిని పోలీసుల అరెస్టు చేసి జైలుకు పంపించారంటూ రూమర్స్ కూడా క్రియేట్ చేశారు..
తాజాగా ఈ వార్తల పైన వరలక్ష్మి స్పందిస్తూ.. మీడియా వాళ్లకు నేను తప్ప ఎవరూ దొరకడం లేదనుకుంటా.. నా గురించి ఎప్పుడో వచ్చిన ఫేక్ వార్తలను మళ్లీ సృష్టిస్తున్నారంటూ ఫైర్ అయ్యింది.. అలాగే సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి .. వాటి గురించి పోరాడండి లోకంలో ఇంకా చాలా పెద్ద సమస్యలే ఉన్నాయి.. మాలాంటి వారి నిశ్శబ్దాన్ని వీక్నెస్ గా చూడకండి.. నిజాలు తెలుసుకోండి.. అసత్య ప్రచారాలు మానేయండి అంటూ ఫైర్ అయ్యింది వరలక్ష్మి శరత్ కుమార్.. ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ చేసిన ఈ ట్వీట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు