Trivikram: గురూజీ పైత్యం

ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ కాంబినేషన్స్ లో త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబినేషన్ కూడా ఒకటి. వీరి కలయికలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు కమర్షియల్ హిట్ కాకపోయినా ఇప్పటికి ఆ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ప్రస్తుతం వీరి కాంబినేషన్ లో SSMB28 (వర్కింగ్ టైటిల్) తెరకెక్కనుంది.

ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ ను వచ్చేనెల నుంచి మొదలుపెట్టనున్నట్లు టీం అధికారికంగా ప్రకటించింది.
ప్రస్తుతం ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం చక్కెర్లు కొడుతుంది. ఈ సినిమాలో పూజ హేగ్దే తో పాటు మరో యంగ్ హీరోయిన్ నటించబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
యంగ్ క్రేజీ బ్యూటీ ‘శ్రీలీల’ కీలక పాత్రలో నటిస్తోందట.

త్రివిక్రమ్ సినిమాలకు సంబంధించి ఈ విషయం కొత్తదేమీ కాదు.
ఒక హీరోయిన్ పాటు ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ ను తెచ్చి పెట్టి సినిమాలో పాత్రలుగా వాడేస్తారు. ఇదివరకే త్రివిక్రమ్ తెరకెక్కించిన జల్సా, సన్నాఫ్ సత్యమూర్తి , అ ఆ, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురంలో సినిమాలలో ఆయా హీరోయిన్స్ తో పాటు పార్వతి మెల్టన్, ప్రణీత , నిత్యా మీనన్ , ఇషారెబ్బ , అనుపమ పరమేశ్వరన్ , నివేథా పేతురేజ్ లాంటి తారలను హీరోయిన్స్ గా కాకుండా పాత్రలు గానే చూపించాడు త్రివిక్రమ్. నిజంగా ఆ కథకు వాళ్ళు అవసరమో లేక అది గురూజీ పైత్యమో అనేది చాలామంది అభిప్రాయం.

- Advertisement -

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న SSMB28 ను వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు