Salman khan: టైగర్ 3 ట్రైలర్.. దేశం కోసం దివాళికి వస్తున్నాడు

 

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ‘ఏక్ తా టైగర్’ గురించి తెలిసిందే. ఆరేళ్ళ కిందట వచ్చిన ఈ సినిమా సల్లూ భాయ్ కెరీర్ లో ఒక బెస్ట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో సల్మాన్ ఒక ఇండియన్ రా ఏజెంట్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక దీనికి సీక్వెల్ గా వచ్చిన టైగర్ జిందా హై కూడా ఓ రేంజ్ లో సక్సెస్ అయింది. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి టైగర్ సిరీస్ నుండి సినిమా వచ్చేస్తుంది. ఫస్ట్ రెండు పార్ట్స్ లో ఉన్న సల్మాన్ ఖానే మూడో పార్ట్ లో కూడా నటించడం జరిగింది.

టైగర్ 3 పేరుతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ అయింది. ఇక ఈ మూడో పార్ట్ లో టైగర్ పైన అనుకోకుండా దేశద్రోహి అనే ముద్ర పడుతుంది. దానికి కారణం ఎవరు, ఎందుకు తనని టార్గెట్ చేసారు. తన దేశానికి సమస్య వచ్చినపుడు టైగర్ తిరిగి ఎలా వచ్చాడు. దేశంకోసం ఏం చేసాడు అన్నదే కథగా చూపించాడు. ఇక కత్రినా కైఫ్ ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించగా, తన క్యారెక్టర్ కూడా టైగర్3 లో హైలెట్ అవనుంది.

- Advertisement -

ఇక టైగర్3 లో బాలీవుడ్ కిస్సింగ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించాడు. ఇక ఈ సినిమాని మనీష్ శర్మ డైరెక్ట్ చేయడం జరిగింది. ప్రీతం ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇక ట్రైలర్ లో లాస్ట్ చెప్పిన “టైగర్ కి శ్వాస ఉన్నంత వరకు ఓటమిని ఒప్పుకోడు” అన్న డైలాగ్ సూపర్ గా ఉంది.

అయితే గత కొన్నాళ్లుగా బాలీవుడ్ సినిమాలు తెలుగులో రెగ్యులర్ గా రిలీజ్ అవుతుండగా, ఇప్పుడు సల్మాన్ ఖాన్ టైగర్ 3 కూడా తెలుగులో రిలీజ్ కానుంది. ఈ దీపావళి కానుకగా నవంబర్12 న రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించడం జరిగింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు