“ఎవడే సుబ్రహ్మణ్యం” సినిమా తో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా తోనే విజయం సాధించి మంచి గుర్తింపు తెచ్చుకొన్న యువ నటి మాళవిక నాయర్. ఢిల్లీ కి చెందిన ఈ భామ మొదట మలయాళం లో సినిమాలు చేయగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ ద్వారా తెలుగులో పరిచయం అయింది. ఎవడే సుబ్రహ్మణ్యం, తర్వాత కళ్యాణ వైభోగమే సినిమా తో మరోసారి మంచి విజయం సాధించింది.
అయితే ఆ తర్వాత మాత్రం ఈ హీరోయిన్ కి ఏ సినిమా కూడా కలిసి రాలేదు. ‘మహా నటి’, ‘టాక్సీ వాలా’ సినిమాలు హిట్ అయినా అందులో ఈమె సైడ్ రోల్ చేసింది. తర్వాత నటించిన విజేత, నిను వీడని నీడను నేనే, ఒరేయ్ బుజ్జిగా, థ్యాంక్ యూ, సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇక రీసెంట్ గా వచ్చిన “ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి” మూవీ కి డీసెంట్ టాక్ వచ్చిన ఏం ఆడలేదు. నటన పరంగా మాళవికకు మంచి మార్కులే పడుతున్నా హిట్స్ మాత్రం పడట్లేదు.
తాజాగా “అన్ని మంచి శకునములే” సినిమా తో మళ్ళీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.ఈ సినిమాలో సంతోష్ శోభన్ హీరోగా నటించగా నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. మీక్కి జె మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇక ఈ సినిమా ను స్వప్న సినిమా బ్యానర్ పై వైజయంతి మూవీస్ సమర్పణ లో స్వప్న దత్ సినిమాను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ వల్ల ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. “అన్ని మంచి శకునములే” సినిమాను మే లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News