Naga Chaitanya: ‘థాంక్యూ’ ఓటీటీకి ఇవ్వాల్సిన సినిమా…?

విభిన్న కథాంశలతో కూడుకున్న చిత్రాలను ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు దర్శకుడు విక్రమ్ కె కుమార్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘థాంక్యూ’. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. నాగ చైతన్య, రాశీ ఖన్నా జంటగా నటించిన థాంక్యూ సినిమాలో అవికా గోర్ కూడా కీలక పాత్ర పోషించింది. టీజర్ తోనే ఈ చిత్రం పై మంచి అంచనాలు నెలకొన్నాయి. లైఫ్ లో ఉన్నత స్థాయికి చేరుకున్న ఓ హీరో.. అదంతా తన స్వయంకృతం అనే అతిశయోక్తి, అహం కలిగి ఉంటాడు. అలాంటి హీరో మంచిగా మారి తన జీవితంలో ఒక్కో స్టేజిలో తనకు సాయం చేసిన వాళ్ళ వద్దకు వెళ్లి.. వాళ్ళు సమస్యల్లో ఉంటే వాటిని తీర్చి…థాంక్యూ చెప్పి తిరిగి తన కెరీర్ ని కొనసాగించడానికి వెళ్ళిపోతాడు.

బి.వి.ఎస్ రవి ఈ చిత్రానికి కథ అందించాడు. అయితే ఈ చిత్రం పూర్తిగా విక్రమ్ కె కుమార్ స్టైల్లోనే సాగుతుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. నిజానికి ఈ చిత్రాన్ని ఓటీటీకి ఇచ్చేయాలి అని మొదట దిల్ రాజు అనుకున్నారట. ఆ టైములో టికెట్ రేట్ల ఇష్యు ఉండడం.. జనాలు థియేటర్ కు రావడానికి భయపడుతూ ఉండడంతో దిల్ రాజు ఈ నిర్ణయానికి వచ్చారట. అయితే ‘లవ్ స్టోరీ’ చిత్రం రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవ్వడంతో ఆయన ‘థాంక్యూ’ ఓటీటీ ఆలోచనని విరమించుకున్నట్టు తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు