Gopichand: తన మొదటి పారితోషికం ఎంతో చెప్పిన గోపీచంద్..!

‘సీటీమార్’ తర్వాత యాక్షన్ హీరో గోపీచంద్ నుండి రాబోతున్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. టాప్ డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ‘జి ఎ 2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ లభించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తన సినిమా కోసం గోపీచంద్ ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో గోపీచంద్ తన మొదటి సినిమా పారితోషికం పై కూడా స్పందించారు. ‘జయం’ సినిమా కోసం గోపీచంద్ కు రూ.11వేలు పారితోషికం ఇచ్చారట. ఆ చిత్రానికి దర్శకుడు, నిర్మాత రెండు తేజ కాబట్టి… అందులోనూ 11 అతని లక్కీ నెంబర్ కాబట్టి గోపీచంద్ కు రూ.11వేలు పారితోషికం ఇచ్చారట. జయం సినిమాలో గోపిచంద్ విలన్ నటించిన సంగతి మనకు తెలిసిందే.

నిజానికి గోపీచంద్ మొదటి చిత్రం ‘తొలివలపు’. అతను హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూవీ అది. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ్వడం.. పైగా తన సొంత బ్యానర్లో చేసిన మూవీ కావడంతో భారీ నష్టాలు వచ్చాయి. సో ఆ చిత్రానికి గాను గోపీచంద్ కు ఎటువంటి పారితోషికం లేదని స్పష్టమవుతుంది. విలన్ గా ‘జయం’ ‘నిజం’ ‘వర్షం’ వంటి చిత్రాలు చేసిన తర్వాత ‘యజ్ఞం’ తో మళ్ళీ హీరోగా మారాడు గోపీచంద్. అక్కడి నుంచి ఇతను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు