Nithin: నితిన్ ఎమోషనల్ ట్వీట్

జయం సినిమాతో మొదలైన నితిన్ కెరియర్ ఇప్పటికి 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ20 ఏళ్ళ కెరియర్ లో ఎన్నో హిట్ సినిమాలు,వాటిని మించిన ప్లాప్ సినిమాలు ఉన్నాయ్. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన “సై” సినిమా తరువాత వరుసగా ప్లాప్స్ చూసిన నితిన్ కెరియర్ ఇష్క్ సినిమాతో మరో మలుపు తిరిగింది.

పవర్ స్టార్ పై తనకున్న అభిమానాన్ని పంచుకోవడం వలన అప్పటినుండి పవన్ అభిమానులంతా నితిన్ ప్రేమించడం మొదలు పెట్టారు.రీసెంట్ టైమ్స్ లో “భీష్మ” మూవీ తరువాత నితిన్ కి సరైన హిట్ సినిమా పడలేదనేది చాలామంది అభిప్రాయం.నితిన్ ప్రస్తుతం “మాచర్ల నియోజకవర్గం” అనే సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

సినీ పరిశ్రమలో 20 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తిచేసిన నితిన్
ట్విట్టర్ వేదికగా ఒక ఎమోషనల్ మెసేజ్ ని పంచుకున్నాడు.

- Advertisement -

“20 ఏళ్ల కితం జయం సినిమాతో నా సినీ ప్రయాణం స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేనేం చెప్పాలో కూడా మాటలు రావట్లేదు, మొదటగా నన్ను నమ్మి నటునిగా వెండితెరకి పరిచయం చేసిన దర్శకుడు తేజ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా మిగతా దర్శకులు, నిర్మాతలు, నటులు, టెక్నీషియన్స్ ఇలా నేను పని చేసిన ప్రతి సినిమాకి,ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్తున్నాను. ముఖ్యంగా ఇన్నేళ్ళుగా నన్ను అభిమానిస్తూ ఫాలో అవుతూ ఎనలేని ప్రేమని అందిస్తున్న అభిమానుల ప్రేమకి ఎప్పటికీ ఋణపడి ఉంటాను” అనేది ఆ ట్వీట్ సారాంశం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు