టాలీవుడ్ బ్యూటీ తాప్సీ ఈ మధ్య టాలీవుడ్ సినిమాల్లో నటించడం లేదనే విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఎక్కువగా ఈ బ్యూటీ బాలీవుడ్లోనే సినిమాలను చేస్తోంది. బాలీవుడ్లో మాత్రం వరస సినిమాలతో బిజీగా గడిపేస్తుంది. ఇటీవలే దొబారా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తాజాగా తాప్పీ ఓటీటీ ప్లే అవార్డ్స్ 2022 వేడుకలకు హాజరైంది.
ఈ వేడుకల తరువాత మీడియాతో ముచ్చటించారు. ఆ సమయంలో ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఫైర్ అయింది తాప్సీ. ముఖ్యంగా ప్రశ్నలు అడిగేటప్పుడు హోంవర్క్ చేసుకుని రాలేరా అంటూ విరుచుకుపడింది. ఇటీవల ఆమె నటించిన దొబారా సినిమాపై వచ్చిన నెగిటివ్ టాక్ గురించి ఓ విలేకరి ప్రశ్నించగా.. నెగిటివ్ టాక్ బారిన పడని సినిమా ఏదైనా ఉందా అంటూ రివర్స్ అడిగింది. మరో ప్రశ్న అడిగేందుకు విలేకరీ ప్రయత్నించగా.. తాప్సీ మధ్యలో కలుగజేసుకుని ముందు నా ప్రశ్నకు సమాధానం చెబితే మీకు నేను సమాధానం చెబుతానని చెప్పింది.
సినిమాలను విమర్శకులు కూడా మెచ్చుకోలేదు కాదా అని అనగా ఇలాంటి ప్రశ్నలను నన్ను అడిగే ముందు కాస్త హోంవర్క్ చేసుకురండి. అదేవిధంగా మేం ఏం మాట్లాడినా మాకు మర్యాద లేదు అంటారు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.