SSMB28: స్పీడ్ పెంచిన గురూజీ

సర్కారు వారి పాట హిట్ తో మంచి జోష్ మీదున్న మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీళ్ల కాంబినేషన్ లో ఇంతకు ముందు వచ్చిన అతడు, ఖలేజా ఇప్పటికి అభిమానులకు చాలా ఇష్టం. ఈ సినిమాలు టీవీల్లో ఎప్పుడు వచ్చినా సరే కొత్త సినిమాలకు ధీటుగా పోటీనిస్తాయి. ఇప్పుడు వీరి కలయికలో మూడో సారి వస్తున్న సినిమా కావడంతో అభిమానులకే కాకుండా ఇండస్ట్రీ లోనూ మంచి అంచనాలున్నాయి.

అలవైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ చేస్తున్న సినిమా ఇది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ను హారిక &హాసిని ప్రొడక్షన్స్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ సినిమాలో పూజా హెగ్డే, హీరోయిన్ గా కనిపించనుంది. ఇటు పూజ హెగ్డే తోను త్రివిక్రమ్ కి హ్యాట్రిక్ సినిమాయే కావడం తో సోషల్ మీడియా లో పూజాని వదలని త్రివిక్రమ్ అంటూ ఫన్నీ మీమ్స్ వేస్తున్నారు.

ఇదిలా ఉండగాచ ఇప్పటికే 50% శాతం కంప్లీట్ అయినా షూటింగ్ తాజాగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. చిత్రంలోని కీలక సన్నివేశాలను హైదరాబాద్లోని ఓ ఫామ్ హౌస్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో సినిమాలో రాత్రి పూట వచ్చే పలు కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారని టాక్. దీరి తర్వాత యాక్షన్ సన్నివేశాలను రామోజీ ఫిలిం సిటీలో తెరకెక్కించే అవకాశం ఉందని సమాచారం. కాగా ఈ చిత్రాన్ని 2023 అక్టోబర్ లో లేదా 2024 సంక్రాంతి కి విడుదల చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు