SSMB28: ఎట్టకేలకు

సర్కారు వారి పాట సినిమాతో హిట్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా పనుల్లో పడిపోయాడు. ఎప్పుడో అనౌన్స్ చేసిన SSMB28 ఇప్పటివరకు పట్టాలు ఎక్కలేదు. త్రివిక్రమ్ అల వైకుంఠపురంలో సినిమా తరువాత ఇప్పటివరకు సినిమా చేయలేదు. పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన రీమేక్ ఫిల్మ్ భీమ్లా నాయక్ సినిమా రైటింగ్ లో త్రివిక్రమ్ ఇన్వాల్ అవ్వడం వలన తన సొంత ప్రాజెక్ట్ ను కొంతకాలం పక్కన పెట్టేసాడు. ఎట్టకేలకు అటు భీమ్లా నాయక్, ఇటు మహేష్ బాబు సర్కారు వారి పాట విడుదలైపోయాయి.

కాబట్టి సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ తమ సినిమాపైన ద్రుష్టి సారించారు. రెగ్యులర్ షూట్ మరియు విడుదల తేదీకి సంబంధించి ప్రకటన చేయడానికి మేకర్స్ ఒక వీడియోను విడుదల చేశారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. 2023 వేసవిలో SSMB28 ను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.

SSMB28లో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ. ఎడిటర్ నవీన్ నూలి. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు