SSMB28 : ఆ డైరెక్టర్లకు ఝలక్ ?

మ‌హేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. అగ్ర నిర్మాణ సంస్థ ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ పై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ‘మహర్షి’ తర్వాత పూజాహెగ్డే మరోసారి మహేష్ తో జతకడుతుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ఆగస్టు నెల నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది అని అధికారిక ప్రకటన వచ్చింది. అలాగే, 2023 వేసవి సెలవుల కానుకగా ఈ చిత్రం విడుదల అవుతున్నట్టు కూడా మేకర్స్ ప్రకటించారు.

‘ఖలేజా’ తర్వాత త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన సినిమాలు అన్నీ 6 నెలల్లో కంప్లీట్ చేసినవే. ఒక్క ‘అజ్ఞాతవాసి’ మాత్రం పవన్ కళ్యాణ్ డేట్స్ వల్ల 9 నెలల వరకు షూటింగ్ జరిగింది. మహేష్ బాబు సినిమాను కూడా త్రివిక్రమ్ 4 నెలల్లో కంప్లీట్ చేసి సంక్రాంతి కానుకగా విడుదల చేస్తారు అని అంతా భావించారు. కానీ ఈ చిత్రాన్ని 2023 వేసవికే విడుదల చేస్తున్నట్లు ప్రకటించి అభిమానులను కొంత నిరాశ పరిచారు.

మేకర్స్ ప్రకటన ఫ్యాన్స్ ను ఎంత నిరాశ పర్చిన విషయం పక్కన పెడితే, ఓ ఇద్దరు దర్శకులు మాత్రం షాక్ అయ్యారు. ఆ ఇద్దరు దర్శకులు మరెవరో కాదు అనిల్ రావిపూడి, పరశురామ్. ఎందుకంటే రాజమౌళి దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మొదలుపెట్టే లోపు త్రివిక్రమ్ సినిమాతో పాటు మరో సినిమా కూడా ఫినిష్ చేయాలని మహేష్ అనుకున్నారు అంటూ ప్రచారం జరిగింది.

- Advertisement -

ఈ క్రమంలో మహేష్ ను అనిల్ రావిపూడి, పరశురామ్ అప్రోచ్ అవ్వడం కూడా జరిగిందని టాక్. కానీ త్రివిక్రమ్ సినిమా 2023 వేసవిలో రిలీజ్ అవుతుంది అంటే మహేష్ కు మరో సినిమా చేసే ఉద్దేశం లేనట్టే. త్రివిక్రమ్ మూవీ పూర్తి చేసిన వెంటనే రాజమౌళి మూవీ కోసం మేకోవర్ డెవలప్ చేసుకోవాలని మహేష్ ఆలోచిస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు