Soundarya: రూ.100 కోట్ల ఆస్తి ఎవరి సొంతం.?

Soundarya.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి తర్వాత అంత మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఎవరైనా ఉన్నారంటే సౌందర్య పేరు ప్రధమంగా వినిపిస్తుంది.. ప్రస్తుతానికి ఆమె మన మధ్య లేకపోయినా ఆమె నటించిన సినిమాలు మాత్రం ఎప్పటికీ ఆమెను ఉన్నత స్థాయిలో నిలబెడతాయి అనడంలో సందేహం లేదు.. భారతీయ సినీ నటిగా గుర్తింపు తెచ్చుకున్న సౌందర్య తెలుగు , తమిళ్ , కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో నటించి అవార్డులు కూడా సొంతం చేసుకుంది.. హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.. ఇదిలా ఉండగా మరొకవైపు చనిపోయే ముందు ఆమె రూ.100కోట్ల విలువైన ఆస్తిని వీలునామా రాసింది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. అయితే ఆ వీలునామా ఎవరి పేరు మీద రాసింది? అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు .. అయితే ఈ రూ.100 కోట్ల ఆస్తి వెనుక వున్న అసలు నిజమేంటో ఇప్పుడు చూద్దాం..

Soundarya:Who owns the property of Rs.100 crore?
Soundarya:Who owns the property of Rs.100 crore?

సౌందర్య రూ.100 కోట్ల ఆస్తి వారికే..

నేటికీ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఈమె.. అతి తక్కువ సమయంలోనే హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకుంది.. అయితే ఈమె మరణించే సమయానికి గర్భవతి.. కోట్ల ఆస్తికి యజమాని కూడా.. అప్పటి లెక్క ప్రకారం సౌందర్యకు దాదాపు రూ.100 కోట్ల ఆస్తి ఉందని.. కుటుంబ సభ్యులు తెలిపారు.. అయితే ఆ సమయంలో ఆస్తి విషయంలో కూడా గొడవలు జరిగాయి.. సౌందర్య తన వంద కోట్ల ఆస్తికి వీలునామా రాసిందనే వార్త వైరల్ గా మారగా.. ఈ వార్త వైరల్ కావడంతో సౌందర్య భర్తతో పాటు ఈమె తల్లి కూడా దీనిని ఖండించారు.. పైగా 31 ఏళ్ల వయసులో వీలునామా ఆమె ఎందుకు రాస్తుంది అని కూడా ప్రశ్నించారు. దీంతో సౌందర్య రూ.100 కోట్ల ఆస్తి వ్యవహారం చర్చనీయాంశమయ్యింది. సౌందర్య తల్లి , ఆమె భర్త ఇద్దరు వ్రాసిన వీలునామాను దాచిపెట్టి సగం వాటాను పంచుకున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయాలు మాత్రం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గానే మారుతున్నాయి..

ఆస్తి పంచుకున్నారే కానీ ఆశయాలు కాదు..

ఈమె మరణానంతరం కుటుంబంలో ఆస్తి తగాదాలు కూడా ఏర్పడ్డాయి.. సౌందర్య తల్లిదండ్రులు, అత్తమామలు కూడా ఆస్తి విషయంలో గొడవపడ్డారు.. కోర్టు మెట్లు కూడా ఎక్కారు.. ఇక కొద్ది రోజుల్లోనే కోర్టు బయట సెటిల్ చేసుకొని.. ఆస్తులను పంచుకున్నారు.. సౌందర్య చనిపోవడంతో సౌందర్య భర్త రఘు కోర్ట్ నుంచి ఆస్తిని తీసుకున్నాడు అని… ఆ తర్వాత అపూర్వ అనే అమ్మాయిని వివాహం కూడా చేసుకున్నారని.. ప్రస్తుతం గోవాలో సెటిల్ అయ్యారని చెబుతున్నారు. ఇకపోతే సౌందర్య సినీ రాజకీయ రంగాలలో చురుగ్గా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది.. ఆ కార్యక్రమాలను మరింత విస్తరించాలని ఆమె కోరుకుందట.. అయితే ఆమె సంపదను పంచుకున్న వారు ఆమె ఆశయాలను పంచుకోలేదని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈమె రూ.వంద కోట్ల ఆస్తిని అటు అత్తమామలు , భర్త ఇటు తల్లిదండ్రులే పంచుకున్నారనే వార్త తెరపైకి వచ్చింది.కానీ ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు