Shahrukh Khan: బాలీవుడ్ బడా హీరో అయినా షారుక్ ఖాన్ ప్రజెంట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక ఒక పక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే మరో పక్క ఐపిఎల్ తోను బిజీగా మారాడు ఈ హీరో. కోల్కత్తా నైట్ రైడర్స్ కు షారుక్ ఖాన్ యజమాని గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ ఏడాది ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ అదరగొడుతుంది. రీసెంట్ గానే ఫినాలి కి కూడా చేరుకుంది.
దీంతో షారుక్ ఫుల్ ఖుషి అయ్యారు. అయితే స్టేడియంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సురేష్ రైనాకు షారుక్ క్షమాపణలు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. అహారాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో కేకేఆర్, ఎస్ ఆర్ హెచ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ అనంతరం షారుక్ గ్రౌండ్లోకి వెళ్ళాడు. అంతేకాదు అభిమానుల వైపు చేతులు ఊపుతూ సంతోషం వ్యక్తం చేశారు.
#ShahRukhKhan doing his traditional victory lap 💜#KKRvsSRHpic.twitter.com/zUdlCgRZla
— 😎Sourav Srkian Das😎 (@SrkianDas04) May 21, 2024
సురేష్ రైనా, ఆకాష్ చోప్రా గ్రౌండ్లో లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నారు. అయితే షారుక్ అది గమనించకుండా.. గ్రౌండ్లోకి వచ్చాడు. అనంతరం సురేష్, ఆకాష్ లైవ్ లో ఉన్నారని షారుక్ కి తెలిసింది. దీంతో వారికి ఇబ్బంది కలిగించాను అని భావించి షారుక్ వారికి క్షమాపణలు తెలియజేశారు. వారికి హాగ్ ఇస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చి క్షమాపణలు తెలిపారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.