Samyuktha Menon : తెలుగు కంటే మలయాళ ఇండస్ట్రీనే బెటర్… బాంబ్ పేల్చిన సంయుక్త

Samyuktha Menon : తెలుగులో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత టాలీవుడ్ పై బాంబు పేల్చడం అన్నది హీరోయిన్లకు కొత్తేమీ కాదు. కాకపోతే ఆ లిస్ట్ లో ఊహించని విధంగా సంయుక్త మీనన్ కూడా చేరిపోయింది. ఏకంగా టాలీవుడ్ కంటే మలయాళ ఇండస్ట్రీ నే బెటర్ అంటూ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఆమెకి తెలుగులో కంటే మలయాళ ఇండస్ట్రీలో నటించడమే ఈజీ అని చెప్పుకొచ్చింది. మరి తెలుగు మూవీ లవర్స్ ఇంతగా ఆదరించిన సంయుక్తకు టాలీవుడ్ లో కలిగిన కష్టమేంటి? అనే వివరాల్లోకి వెళితే…

టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన అతి కొద్ది సమయంలోనే వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్. 2022లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో ఈ బ్యూటీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బింబిసారా, సర్, విరూపాక్ష వంటి సినిమాలతో వరుస హిట్లు తన ఖాతాలో వేసుకుంది. దీంతో సంయుక్త మీనన్ లక్కీ గర్ల్ అనే ముద్ర పడిపోయింది టాలీవుడ్ లో. కానీ గత ఏడాది ఆమె చేసిన డెవిల్ మూవీ పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం తెలుగుతో పాటు పలు మలయాళ సినిమాలతో బిజీగా ఉన్న సంయుక్త తాజాగా తెలుగు, మలయాళ ఇండస్ట్రీలను పోలుస్తూ సంచలన కామెంట్స్ చేసింది. మలయాళం తో పోలిస్తే తెలుగు సినిమాల్లో నటించడం కష్టం అంటూ తన అభిప్రాయాన్ని బయట పెట్టింది.

తను ఇలా చెప్పడానికి భాష ఒక కారణం అయితే మేకప్ మరో కారణం అని సిల్లీ రీజన్ చెప్పుకొచ్చింది. వినడానికి వింతగా ఉన్న తన వరకు ఇది చాలా పెద్ద విషయం అంటూ కామెంట్స్ చేసింది. మలయాళం సినిమాల్లో నటించేటప్పుడు మేకప్ వేసుకోవడం ఈజీగా అయిపోతుందని, ఎందుకంటే అక్కడ చాలా లైట్ గా, సహజంగా మేకప్ వేస్తారని వివరించింది. అలాగే నటించేటప్పుడు కూడా పూర్తిగా స్వేచ్ఛ ఉన్న ఫీలింగ్ కలుగుతుందని చెప్పుకొచ్చింది.

- Advertisement -

ఇక టాలీవుడ్ విషయానికి వస్తే స్వీయ జాగ్రత్తలు ఎన్నో తీసుకోవాలని అదే కష్టంగా మారిందని చెప్పుకొచ్చింది. తెరపై ఎలా కనిపిస్తామా అంటూ ఎప్పటికప్పుడు చూసుకోవాలని, అలాగే ఇక్కడ ఎక్కువ మేకప్ వేస్తారని మలయాళ ఇండస్ట్రీకి టాలీవుడ్ కు మధ్య ఉన్న తేడాను చెప్పుకొచ్చింది. అంతేకాకుండా షాట్ చేస్తున్నప్పుడు కూడా మేకప్ ను చెక్ చేసుకోవాలని, ఇది తన కంఫర్ట్ కు పూర్తిగా ఆపోజిట్ గా ఉంటుందని సంయుక్త చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దీనివల్ల సినిమా చేస్తున్నంత సేపు చర్మం, ముఖంపై ఏదో ఉన్నట్టుగా అనిపిస్తుందని అన్నారామె.

ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సోషల్ ఫ్యాంటసీ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోంది. అలాగే యంగ్ హీరోలు శర్వానంద్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలకు కూడా సంయుక్త మీనన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు