Regina: ఈ మ‌ధ్య ఏదో అన్నావ్‌

హీరోయిన్ రెజీనా క‌సాండ్రా, నివేదా థామ‌స్ ప్రధాన పాత్ర‌లలో న‌టించిన తాజా మూవీ శాకిని ఢాకిని. ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్ప‌టికే అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకొని సెప్టెంబ‌ర్ 16న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది. ఇక ఇప్ప‌టికే ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌మోష‌న్స్ జోరుగా కొన‌సాగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో సోమవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించింది చిత్ర బృందం.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి నందినీ రెడ్డి, హీరో అడివి శేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న అడివి శేష్ ఇటీవ‌ల రెజీనా అబ్బాయిల మీద చేసిన కామెంట్స్‌కి రివ‌ర్స్ కౌంట‌ర్ ఇచ్చాడు. రెజీనాతో పాటు నివేదానుత‌న‌దైన స్టైల్ లో ప్ర‌శ్న‌ల‌తో ఆ ఇద్ద‌రిని ముప్పుతిప్ప‌లు పెట్టాడు. ముఖ్యంగా రెజీనాను ఉద్దేశిస్తూ.. ఈ మ‌ధ్య ఏదో అన్నావ్‌.. అబ్బాయిలు మ్యాగీ 2 నిమిషాలు అని ఏంటీ సంగ‌తి నాకు చెప్పు.. చాలా మంది నాకు స్టామినా ఎక్కువ అని చెప్పారు అని అడ‌డ‌గా.. 2 నిమిషాల్లో చెబుతాను అంటూ న‌వ్వుతూ చెప్పింది రెజీనా.

ఇక అడ‌విశేష్ ఆ త‌రువాత తాను జోక్‌గా అడిగిన‌ట్టు చెప్పారు. ఇటీవ‌ల శాకిని ఢాకిని ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా రెజీనా ఓ ఇంట‌ర్వ్యూలో అబ్బాయిలు మ్యాగీని 2 నిమిషాల్లో అయిపోతాయంటూ ఫ‌న్నీ కామెంట్స్ చేసిన విష‌యం తెలిసిందే. కొరియ‌న్ సూప‌ర్ హిట్ మిడ్ నైట్ ర‌న్న‌ర్స్ చిత్రానికి రీమెక్‌గా శాకిని ఢాకిని చిత్రాన్ని తీసుకొస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం సెప్టెంబ‌ర్ 19 వ‌ర‌కు వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు